Home » Canada
భారత, కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రికతలు కొనసాగుతున్న తరుణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సుమారు రెండు నెలలుగా కెనడా పౌరులకు నిలిపివేసిన ఈ-వీసా సేవలను భారత్ పునరుద్ధరించింది. జీ-20 దేశాధినేతల వర్చువల్ సమావేశానికి ముందు ఈ నిర్ణయం వెలువడటం విశేషం.
ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉందని ఎప్పుడైతే కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణలు చేశాడో.. అప్పటి నుంచి ఖలిస్తాన్ మద్దతుదారుల ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. కెనడాలో వాళ్లు రోజురోజుకీ రెచ్చిపోతూనే ఉన్నారు.
కెనడా గడ్డపై ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్ ప్రమేయంపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి తన ఆరోపణలు కొనసాగించారు. తమ దేశం ఎప్పుడూ చట్ట పాలనకు కట్టుబడి ఉంటుందని అన్నారు.
కెనడాలోని ఎడ్మాంటన్ (Edmonton) లో జరిగిన గ్యాంగ్వార్ ఘటనలో11 ఏళ్ల కుమారుడితో పాటు 41 ఏళ్ల తండ్రి హర్ప్రీత్ ఉప్పల్ చనిపోయారు. ఆ గ్యాంగ్ ఉద్దేశపూర్వకంగా గ్యాస్ స్టేషన్ వెలుపల ఇలా తండ్రికొడుకును లక్ష్యంగా చేసుకుని కాల్చి చంపినట్లు పోలీసులు నిర్ధారించారు.
Khalistan Terrorist: ఖలిస్తానీ ఉగ్రవాదీ గురుపత్వంత్ సింగ్ పన్నూన్(Gurpatwant Singh Pannun) బెదిరింపులపై కెనడా ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనపై కెనడా రవాణా శాఖ మంత్రి స్పందిస్తూ.. తాము ప్రతి ముప్పును తీవ్రంగా పరిగణిస్తామన్నారు. గత వారం పన్నూన్ రెండు వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
తన తండ్రి మరణానికి ఎయిర్లైన్స్ కారణమని ఓ లేడీ ఎన్నారై (NRI) సంచలన ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచారు. కెనడాలో నివసిస్తున్న భారతీయ సంతతికి చెందిన షాను పాండే( Shanu Pande) తన తండ్రి హరీష్ పంత్( Harish Pant) మరణానికి తాము ప్రయాణించిన ఒక ఎయిర్లైన్స్ కారమణమని అంటున్నారు.
ఖలీస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనక భారత ఎజెంట్ల హస్తం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన వివాదాస్పద వ్యాఖ్యల తర్వాత ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. ఇలాంటి ఉద్రిక్తతల సమయంలో ఒట్టావాలోని కెనడియన్ పార్లమెంట్ హిల్ (Candian Parliament Hill) లో ఆదివారం (నవంబర్ 5న) దీపావళి వేడుకలు జరగడం విశేషం.
గతవారం జరిగిన 'తాకా' ఎన్నికల ఫలితాలలో ఈ క్రిందివారు రాబోయే రెండు సంవత్సరాల (2023-2025) కాలానికి కార్య నిర్వాహక కమిటీ, ధర్మకర్తల మండలిగా (బోర్డు ఆఫ్ ట్రస్టీలు) ఎన్నికయ్యారు.
ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసు విషయంలో.. భారత్, కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అతని హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో...
భారత్, కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్న కొత్తలో భారత ప్రభుత్వం కెనడియన్లకు వీసా సర్వీసుల్ని తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సేవల్ని అక్టోబర్ 26వ తేదీ నుంచి పునఃప్రారంభించాలని...