Home » Businesss
శుక్రవారం ఇంట్రాడేలో సెన్సెక్స్ 81,177 వద్ద గరిష్ఠాన్ని తాకి చివరికి 80,501 వద్ద స్థిరపడింది. విదేశీ పెట్టుబడులు, జీఎస్టీ వసూళ్ల రికార్డు, మార్కెట్ సానుకూలతతో సూచీలు లాభపడాయి.
ఏప్రిల్లో దేశీయ తయారీ రంగం వృద్ధి 10 నెలల గరిష్ఠానికి చేరింది. కొత్త ఆర్డర్లతో తయారీ సూచీ 58.2 పాయింట్లకు పెరిగింది.
అమెజాన్ ఇండియా 300 లోపు ఉన్న ఉత్పత్తులకు రిఫరల్ ఫీజును ఎత్తివేసింది. ఇది 135 కేటగిరీల ఉత్పత్తులకు వర్తిస్తుండగా, చిన్న వ్యాపారులకు మద్దతుగా నిలిచే నిర్ణయమని పేర్కొంది.
భూషణ్ పవర్ అండ్ స్టీల్ టేకోవర్పై జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్రణాళికను సుప్రీంకోర్టు తిరస్కరించింది. బీపీఎస్ఎల్ను లిక్విడేషన్కు పంపించాలని ఆదేశాలు జారీ చేసింది.
ఆడి ఇండియా తన వాహనాల ధరలను 2 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. కొత్త ధరలు ఈ నెల 15 నుంచి అమల్లోకి రానున్నాయి.
Flipkart Big Saving Days May 1: మీరు AC, స్మార్ట్ టీవీ లేదా ఐఫోన్ తక్కువ ధరలోనే కొనుగోలు చేయాలని చూస్తుంటే ఇదో గొప్ప ఛాన్స్. ఫ్లిప్కార్ట్ త్వరలోనే మెగా సేల్ను ప్రారంభించనుంది. ఈ వస్తువులైతే సగం ధరకే కొనుక్కోవచ్చు. ఇతర ఉపకరణాలపైనా భారీ తగ్గింపు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ 2024–25లో రూ.10.71 లక్షల కోట్ల స్థూల ఆదాయంతో భారతదేశంలో ఈ ఘనత సాధించిన తొలి సంస్థగా నిలిచింది.జియో, రిటైల్, జియోస్టార్ లాభాలు వృద్ధి చెందగా, ఓ2సీ విభాగం మాత్రం తక్కువ వృద్ధిని చూపింది
భారత్–పాక్ సరిహద్దులపై ఉద్రిక్తతలతో మార్కెట్లు కుదేలై రెండు రోజుల్లో రూ.8.88 లక్షల కోట్ల నష్టం వచ్చింది.కెనరా రొబెకో, ప్రెస్టేజ్ హాస్పిటాలిటీ ఐపీఓలకు సెబీకి డాక్యుమెంట్లు సమర్పించాయి
దేశీయ అణు విద్యుత్ ప్లాంట్లలో 49 శాతం వరకు విదేశీ పెట్టుబడులకు అనుమతించేందుకు కేంద్రం యోచనలో ఉంది.ఇది శుద్ధ ఇంధన ఉత్పత్తిని పెంపొందించడంలో కీలకంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
2024–25 మార్చితో ముగిసిన త్రైమాసికంలో మారుతి సుజుకీ నికర లాభం 1 శాతం తగ్గి రూ.3,911 కోట్లుగా నమోదైంది.అయితే ఆదాయం పెరగగా, ఖర్చుల పెరుగుదల లాభాలపై ప్రభావం చూపింది; ఒక్కో షేరుకు రూ.135 డివిడెండ్ ప్రకటించింది