Home » Britain
ఇజ్రాయెల్ - పాలస్తీనా మధ్య భీకర పోరు జరుగుతున్న వేళ.. ప్రపంచ దేశాధినేతలు ఇజ్రాయెల్ కు క్యూ కడుతున్నారు. నిన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ఇజ్రాయెల్ లో పర్యటించగా ఇవాళ బ్రిటన్ ప్రధాని ఆ దేశానికి వస్తున్నారు. ఆ దేశ ప్రధాని రిషీ సునక్ (Rishi Sunak) ఇజ్రాయెల్ లో పర్యటించనున్నారు. బ్రిటన్ ప్రధానమంత్రి కార్యాలయం అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించింది.
యాపిల్ వాయిస్ అసిస్టెంట్ సాఫ్ట్వేర్ కారణంగా బ్రిటన్కు చెందిన ఓ యువతి తన పేరును మార్చుకోవాల్సి వచ్చింది. యాపిల్ సాఫ్ట్వేర్ iOS తాజా అప్డేట్ కారణంగా ఆ మహిళకు పలు ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. దీంతో 6 ఏళ్ల ఫిట్నెస్ ట్రైనర్ సిరి అనే యువతి తన పేరును మార్చుకోవాలని నిర్ణయించుకుంది.
స్టూడెంట్స్, పర్యాటలకు బ్రిటన్ (Britain) బిగ్ షాక్ ఇచ్చింది. విద్యార్థి, విజిటర్ వీసాల ఫీజును బ్రిటన్ భారీగా పెంచిన విషయం తెలిసిందే. ఇంతకుముందు యూకే హోం ఆఫీస్ ప్రకటించినట్లు నేటి (బుధవారం) నుంచి ఈ పెంపు అమల్లోకి రానుంది.
ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న భారత్(India) వంటి విశాలమైన మార్కెట్ను వదులుకోలేని ఆర్థిక అవసరాలు; తమకు పోటాపోటీగా, పక్కలోబల్లెంలా నిలుస్తున్న చైనాను ఆసియాలో నిలువరించటానికి భారత్తో ఉన్న వ్యూహాత్మక అవసరాలు.. ఇదంతా ఒకవైపు; నరేంద్రమోదీ(MODI) వంటి ఆధిపత్య భావజాలంతో కూడిన నాయకుడితో తలెత్తుతున్న వైరుధ్యాలు, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ క్రమంగా నిరంకుశత్వం వైపుగా పయనిస్తున్నదన్న ఆందోళనలు మరోవైపు.. ఈ రెండింటి మధ్య అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా తదితర దేశాలు ఎటూ తేల్చుకోలేక సతమతమవుతున్నాయి.
స్టూడెంట్స్, విజిటర్లకు బ్రిటన్ (Britain) బిగ్ షాక్ ఇచ్చింది. విద్యార్థి, విజిటర్ వీసా ఫీజులను బ్రిటన్ భారీగా పెంచింది. ఆరు నెలలలోపు విజిట్ వీసా ఫీజు (Visit Visa Fee) గతంలో 100 పౌండ్స్ ఉంటే, ఇప్పుడ దాన్ని 115 పౌండ్స్కు పెంచింది.
బ్రిటన్కు చెందిన ఓ 70 ఏళ్ల వృద్ధురాలికి అదృష్టం ఊహించని విధంగా కలిసొచ్చింది. 30 ఏళ్ల పాటు నెలకు రూ.10 లక్షలు చొప్పున ఆదాయం ఇచ్చే లాటరీ దక్కింది.
బ్రిటన్లోని ఎన్నారైలకు (NRIs) భారత ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఎన్నారైలకు భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ (Bharat Bill Payment System) ద్వారా స్వదేశంలో నేరుగా బిల్లులు చెల్లించే సదుపాయాన్ని తీసుకువస్తున్నట్లు ప్రకటించింది.
జీ20 సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన బ్రిటన్ ప్రధాన మంత్రి రుషి సునాక్ సతీ సమేతంగా ఆదివారం ఉదయం ఢిల్లీలోని అక్షరధామ్ దేవాలయంలో పూజలు చేశారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, తాను గర్వించే హిందువునని చెప్పారు.
జీ20 సమావేశాల్లో అన్ని పక్షాలతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చైనా స్పష్టం చేసింది. న్యూఢిల్లీలో జరుగుతున్న సమావేశాల్లో సానుకూల ఫలితాలు రావడం కోసం అందరితో పాటు పని చేస్తామని తెలిపింది.
ప్రపంచంలో అత్యంత సంపన్నమైన, అభివృద్ధి చెందిన దేశాల్లో బ్రిటన్ ఒకటి. అలాంటి దేశం ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతోంది. తాజాగా బ్రిటన్లో రెండో అతిపెద్ద నగరమైన బర్మింగ్హాట్ సిటీ కౌన్సిల్ దివాలా...