Home » Bonalu Festival
Bonalu Festival: గత పదేళ్ల నుంచి ఢిల్లీలో తెలంగాణ భవన్ లో సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాలు ఘనంగా నిర్వహిస్తున్నామని కమిటీ సభ్యులు తెలిపారు. ఢిల్లీలో ఉన్న తెలుగు వారంతా పెద్ద సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వానించారు.
గోల్కొండ కోటలో బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. వేద మంత్రాలతో, ఊరేగింపులతో, శివసత్తులు, పోతరాజుల నృత్యాలతో కోట హోరెత్తింది. ఆధ్మాత్మిక శోభను సంతరించుకుంది.
గోల్కొండ కోటలోని జగదాంబికా అమ్మవారికి తొలిబోనం దక్కింది! పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు, డీజే పాటలు, యువత నృత్యాలతో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అయిన అషాఢమాస బోనాల జాతరకు గురువారం అట్టహాసంగా తెరలేచింది.
బోనాల జాతరకు నగరం సిద్ధమైంది. నెల రోజుల పాటు సాగే ఉత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. పసుపు, కుంకుమలతో ఆలయాలు శోభాయమానంగా రూపుదిద్దుకుంటున్నాయి.
అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ శాంతులతో, ఆయురారోగ్యాలతో జీవించాలని తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కోరుకున్నారు. రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగతి సాధించే దిశగా అమ్మవారి దీవెనలు ఉండాలని సీఎం రేవంత్రెడ్డి ఆకాంక్షించారు.
ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకొనే బోనాల ఉత్సవాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం బోనాలను అధికారిక పండుగగా ప్రకటించినది. దాంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని అలయాల్లో ఉన్న అమ్మవార్లకు భక్తులు బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకోనున్నారు.
బోనాలు ఎత్తుకుని ఆలయానికి వచ్చే వారికే ప్రథమ ప్రాధాన్యమిస్తామని, వారికి అసౌకర్యం కలగకుండా చూడడమే తమ బాధ్యత అని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.
Bonalu 2025: దేవాలయ ఏర్పాట్ల కోసం భాగస్వామ్యం అవుతున్న అందరికీ మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందనలు తెలియజేశారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఆతిథ్యం ఇవ్వడంలో హైదరాబాద్ నగర ప్రజలు ఎవరికీ తీసి పోరన్నారు.
రాష్ట్ర ప్రజలు నెలరోజుల పాటు అంగరంగవైభవంగా జరుపుకొనే బోనాల ఉత్సవాలు ఈనెల 26 నుంచి జరుగుతాయి. ఆ రోజు గోల్కొండ కోటలోని ఎల్లమ్మ(జగదాంబిక) ఆలయంలో ఉత్సవాలు మొదలవుతాయి.
ఆషాఢమాసంలో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభం కానున్న గోల్కొండ బోనాల ఉత్సవాలను ప్రభుత్వం తరుఫున ఘనంగా నిర్వహిస్తామని రవాణా శాఖామంత్రి హైదరాబాద్ ఇన్చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.