Share News

Bonalu: 26న గోల్కొండ కోటలో బోనాలు ప్రారంభం

ABN , Publish Date - Jun 21 , 2025 | 04:40 AM

రాష్ట్ర ప్రజలు నెలరోజుల పాటు అంగరంగవైభవంగా జరుపుకొనే బోనాల ఉత్సవాలు ఈనెల 26 నుంచి జరుగుతాయి. ఆ రోజు గోల్కొండ కోటలోని ఎల్లమ్మ(జగదాంబిక) ఆలయంలో ఉత్సవాలు మొదలవుతాయి.

Bonalu: 26న గోల్కొండ కోటలో బోనాలు ప్రారంభం

నార్సింగ్‌, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రజలు నెలరోజుల పాటు అంగరంగవైభవంగా జరుపుకొనే బోనాల ఉత్సవాలు ఈనెల 26 నుంచి జరుగుతాయి. ఆ రోజు గోల్కొండ కోటలోని ఎల్లమ్మ(జగదాంబిక) ఆలయంలో ఉత్సవాలు మొదలవుతాయి. జ్యేష్ఠ ఆమావాస్య తర్వాత వచ్చే గురువారం లేదా ఆదివారం బోనాల ఉత్సవాలు ప్రారంభమవుతాయి.


ఈసారి ఆ అమావాస్య ఈనెల 25న వస్తుండటంతో ఆ మర్నాడు గురువారం బోనాల జాతరకు తెరలేవనుంది. గోల్కొండ తర్వాత సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళి, లాల్‌ దర్వాజ మహంకాళి ఆలయంలో పూజలు జరుగుతాయి. ఆషాఢ మాసంలో ఆఖరి రోజు గోల్కొండ కోటలోనే చివరి బోనం పూజ జరుగుతుంది. దీంతో ఉత్సవాలు పూర్తవుతాయి.

Updated Date - Jun 21 , 2025 | 04:40 AM