Home » Bihar
జంగిల్ రాజ్ అంటే తుపాకులు, క్రూరత్వం, సామాజిక వ్యతిరేకత, అవినీతి అని మోదీ అభివర్ణించారు. హింసను ప్రోత్సహించే ప్రభుత్వం మనకు అవసరం లేదని, ఎన్డీయే ప్రభుత్వానికి తిరిగి పట్టం కడదామని పిలుపునిచ్చారు.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు ఏవిధంగా ఉండవచ్చనే దానిపై నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. 2010లో నితీష్ ఎంత బలంగా ఉన్నారో అదేవిధంగా ఈసారి నితీష్ బలపడే అవకాశాలున్నాయని కొందరి అంచనాగా ఉంది.
నితీష్ కుమార్ సీఎంగా ఉన్న మొదటి తొమ్మిదేళ్లు కేంద్రంలోని కాంగ్రెస్-ఆర్జేడీ ప్రభుత్వం ఆయనను పనిచేయనీయలేదని, 2014లో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత బిహార్ అభివృద్ధి కోసం మూడు రెట్లు అధికంగా నిధులు కేటాయించామని మోదీ చెప్పారు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్తో పాటు ఇద్దరు ఈసీలు ఎస్ఎస్ సంధు, వివేక్ జోషి పేర్లను కూడా గుర్తుపెట్టుకోవాలని ప్రియాంక ఓ సభలో ప్రజలను కోరారు. ఈ సందర్భంగా 'చోర్ చోర్' అంటూ ప్రియాంక మద్దతుదారులు నినాదాలు చేయడం కనిపించింది.
బిహార్ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరగబోతోందని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓట్ల చోరీ విషయంపై మరోసారి బీజేపీ, ఈసీపై విమర్శలు చేశారు.
బీహార్ అసెంబ్లీ మొదటి దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. కాసేపటి క్రితమే ప్రారంభమైన పోలింగ్ మందకొడిగా సాగుతోంది. ఓటు వేసేందుకు ఇప్పుడిప్పుడే ఓటర్ల రాక మొదలైంది.
తొలి విడత పోలింగ్ జరుగనున్న నియోజకవర్గాల్లో అందరి దృష్టి ప్రధానంగా వైశాలి జిల్లాలోని రఘోపూర్ అసెంబ్లీ నియోజకవర్గంపై ఉంది. ఇక్కడి నుంచి ఆర్జేడీ నుంచి 'మహాగఠ్బంధన్' ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ పోటీ చేస్తున్నారు.
కేంద్ర మంత్రి జితిన్ రామ్ మాంఝీ బంధువు అయిన జ్యోతి మాంఝీ ఓపెన్ జీప్లో సిల్బట్టా ప్రాంతంలో ప్రచారం చేస్తుండగా కొందరు ఆమెపై రాళ్లు రువ్వినట్టు తెలుస్తోంది. ఒక రాయి ఆమెకు తగలడంలో గాయపడ్డారు.
తేజ్ ప్రతాప్ యాదవ్పై ఆర్జేడీ ఇటీవల బహిష్కరణ వేటు వేసింది. దీంతో ఆయన కొత్తగా 'జన్శక్తి జనతా దళ్' పార్టీ ఏర్పాటు చేసి ఎన్నికల బరిలోకి దిగారు. ఆపార్టీ 22 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తోంది. కాగా, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ 'మహాగఠ్బంధన్' ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్నారు.
ఆ దివ్యాంగుడు మంచంపై పడుకుని బైకును నడపసాగాడు. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ దివ్యాంగుడు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. రోడ్డుపై వెళుతున్న వారు ఎంతో ఆశ్చర్యంగా ఆ మంచం బైకును చూస్తూ ఉన్నారు.