Home » Bharath
భారత్-బ్రిటన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదరడానికి మూడేళ్ల పట్టింది. మోదీ, బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ అక్టోబర్ 2022 నాటికి దీనిపై ఒక ముగింపునకు రావాలని టార్గెట్గా పెట్టుకున్నారు. అప్పట్నించి పలుమార్లు సంప్రదింపులు జరిగాయి.
శాంతి మార్గంలో నడవాలని భారత్ కోరుకుంటే పిడికిలి బిగించి కాకుండా నిండు మనసుతో ముందుకు రావాలని, అభూతకల్పనలతో కాకుండా వాస్తవాలతో రావాలని బిలావల్ భుట్టో అన్నారు. అప్పుడు ఇరుగుపొరుగు దేశాలుగా కలిసి కూర్చుని నిజం ఏమిటో మాట్లాడుకుందామని పేర్కొన్నారు.
పహల్గాం దాడి అనంతరం పాక్పై దెబ్బకు దెబ్బ తీయాలనే అభిప్రాయం బలంగానే వినిపిస్తోంది. భారత్ సైతం పాక్పై వరుస కఠిన చర్యలు తీసుకుంటోంది. సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తూ నిర్ణయం తీసుకుంది.
పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది టూరిస్టులను పొట్టనపెట్టుకున్న కిరాతక చర్యలో పాక్ ప్రమేయానికి ఆధారాలను నిర్ధారించిన భారత్ ఇందుకు ప్రతిగా దశబ్దాల క్రితం నాటి సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. 1960లో అంతర్జాతీయ అభివృద్ధి పునర్మిర్మాణ బ్యాంకు అయిన ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో భారత్, పాక్ మధ్య కుదిరిన నీటి పంపిణీ ఒప్పందమే ఈ సింధు నదీ జలాల ఒప్పందం
పహల్గాం ఉగ్రదాడితో భారతదేశం, పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. కశ్మీర్ వివాదాన్ని పూర్తిగా రూపుమాపాలంటే పాక్ ఆక్రమిత కశ్మీర్ను పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని అంతర్జాతీయ స్థాయిలో భారత్కు సూచనలు వస్తున్నాయి.
జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రదాడికి పాల్పడిన మష్కరులను మట్టుబెట్టేందుకు భద్రతా బలగాలు గాలింపు చర్యలు మరింత ముమ్మరం చేశాయి. అయితే ఈ దాడికి పాల్పడిన ఉగ్రమూకల్లో కొందరూ ఇప్పటికి కశ్మీర్లోనే ఉండి ఉంటారని నిఘావర్గాలు అంచనా వేస్తున్నాయి.
పహల్గామ్ ఉగ్రదాడికి కీలక సూత్రధారిగా భావిస్తున్న లష్కరే తోయిబా చీఫ్ ఆఫీజ్ సయ్యద్కు నాలుగు రెట్లు భద్రత కల్పించాలని పాకిస్తాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. భారతదేశం దాడి చేస్తుందనే భయంతో పాకిస్తాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న సమయంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో ఫోన్ కాల్పై భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందించారు.
ఉగ్రవాదం పోరులో భారత్కు అండగా ఉంటామని అమెరికా మరోసారి స్పష్టం చేసింది. భారత్,పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో ఇరుదేశాల ప్రతినిధులతో ఫోన్లో మాట్లాడారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేపట్టే చర్యలకు సహకారం అందిస్తామన్నారు.
Pakistan Military Alert: భారతదేశం చర్యలకు ఉపక్రమిస్తే తిప్పికొట్టడానికి పాకిస్థాన్ ఆర్మీ సిద్ధమవుతున్నట్లు సమాచారం. జమ్ముకశ్మీర్ సమీపంలోని సరిహద్దు ప్రాంతాలకు పాకిస్థాన్ సైన్యాన్ని మోహరిస్తోంది.