Home » Bharath
భారత్, చైనా సైతం ఉగ్రవాద బాధిత దేశాలేనని జిన్పింగ్ దృష్టికి మోదీ తీసుకువచ్చారని, దీనిపై చైనా మద్దతు కోరారని విక్రమ్ మిస్రీ తెలిపారు. ఉగ్రవాదంపై పోరులో భారత్తో కలిసి వచ్చేందుకు చైనా సుముఖత వ్యక్తం చేసిందన్నారు.
భారత రూపాయి అమెరికన్ డాలర్తో పోల్చితే ఆగస్టు 29న భారీగా పడిపోయింది. దీనికి ప్రధాన కారణం అమెరికా భారత దిగుమతులపై విధించిన భారీ సుంకాలేనని నిపుణులు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉన్నా ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని విశాఖపట్నం ఎంపీ శ్రీ భరత్ ఉద్ఘాటించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎంపీ శ్రీ భరత్ పేర్కొన్నారు.
భారత ఆర్థిక వ్యవస్థ గురించి కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. 2038 నాటికి మన భారత్, కొనుగోలు శక్తి సమానత్వం (PPP) పరంగా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగబోతోందట. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
భారత ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంది. 2030 కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణకు బిడ్ వేసే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.
ఇండియాలో అవామీ లీగ్ కార్యకర్తలు బంగ్లా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండటం కానీ, భారతీయ చట్టాలకు వ్యతిరేకంగా వ్యవహిస్తుండటం కానీ తమ దృష్టికి రాలేదని ఎంఈఓ ఆ ప్రకటనలో తెలిపింది. ఇతర దేశాలకు వ్యతిరేకంగా భారత భూభాగం నుంచి ఎలాంటి రాజకీయ కార్యకలాపాలను ప్రభుత్వం అనుమతించదని పేర్కొంది.
కాన్సులేట్ వద్ద హాజరైన పలువురు దేశభక్తి గీతాలు ఆలపిస్తుండంగా అక్కడకు చేరుకున్న కొందరు ఖలిస్థాన్ జెండాలు ఊపుతూ నినాదాలు చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చెలరేగింది. ఈ దశలో పోలీసులు జోక్యం చేసుకుని ఎలాంటి ఘర్షణ జరక్కుండా పరిస్థితిని చక్కదిద్దారు.
స్పెయిన్లోని భారత రాయబారి దినేష్ కె.పట్నాయక్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సీనియర్ అధికారులు 16వ ఎయిర్ బస్ సి-295ను సెవిల్లెలోని ఎయిర్బస్ డిఫెన్స్ అండ్ స్పేష్ అసెంబ్లీ లైన్లో అందుకున్నారు. స్పెయిన్లో భారత రాయబార కార్యాలయం ఈ విషయాన్ని సోషల్ మీడియా 'ఎక్స్'లో తెలియజేసింది.
భారత విదేశాంగ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ శుక్రవారం నాడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించారు. భారత్-అమెరికా దేశాల భాగస్వామ్యం అనేక మార్పులు, సవాళ్లను ఎదుర్కొందని ఇందుకు అనుగుణంగానే ముఖ్యమైన ఎజెండాపైనే తాము దృష్టి సారించామని చెప్పారు.
Bharat Bandh 2025: సీఐటీయూ శ్రేణులు రోడ్లపై నిరసనలు వ్యక్తం చేశాయి. ప్రభుత్వ ఉద్యోగుల కనీస పెన్షన్ 9 వేల రూపాయలు చేయాలని డిమాండ్ చేశాయి. పశ్చిమ బెంగాల్లో ట్రేడ్ యూనియన్ల నిరసలు ఉద్రిక్తతలకు దారి తీస్తున్నాయి.