Home » Bharath
ఇండియాలో అవామీ లీగ్ కార్యకర్తలు బంగ్లా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండటం కానీ, భారతీయ చట్టాలకు వ్యతిరేకంగా వ్యవహిస్తుండటం కానీ తమ దృష్టికి రాలేదని ఎంఈఓ ఆ ప్రకటనలో తెలిపింది. ఇతర దేశాలకు వ్యతిరేకంగా భారత భూభాగం నుంచి ఎలాంటి రాజకీయ కార్యకలాపాలను ప్రభుత్వం అనుమతించదని పేర్కొంది.
కాన్సులేట్ వద్ద హాజరైన పలువురు దేశభక్తి గీతాలు ఆలపిస్తుండంగా అక్కడకు చేరుకున్న కొందరు ఖలిస్థాన్ జెండాలు ఊపుతూ నినాదాలు చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చెలరేగింది. ఈ దశలో పోలీసులు జోక్యం చేసుకుని ఎలాంటి ఘర్షణ జరక్కుండా పరిస్థితిని చక్కదిద్దారు.
స్పెయిన్లోని భారత రాయబారి దినేష్ కె.పట్నాయక్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సీనియర్ అధికారులు 16వ ఎయిర్ బస్ సి-295ను సెవిల్లెలోని ఎయిర్బస్ డిఫెన్స్ అండ్ స్పేష్ అసెంబ్లీ లైన్లో అందుకున్నారు. స్పెయిన్లో భారత రాయబార కార్యాలయం ఈ విషయాన్ని సోషల్ మీడియా 'ఎక్స్'లో తెలియజేసింది.
భారత విదేశాంగ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ శుక్రవారం నాడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించారు. భారత్-అమెరికా దేశాల భాగస్వామ్యం అనేక మార్పులు, సవాళ్లను ఎదుర్కొందని ఇందుకు అనుగుణంగానే ముఖ్యమైన ఎజెండాపైనే తాము దృష్టి సారించామని చెప్పారు.
Bharat Bandh 2025: సీఐటీయూ శ్రేణులు రోడ్లపై నిరసనలు వ్యక్తం చేశాయి. ప్రభుత్వ ఉద్యోగుల కనీస పెన్షన్ 9 వేల రూపాయలు చేయాలని డిమాండ్ చేశాయి. పశ్చిమ బెంగాల్లో ట్రేడ్ యూనియన్ల నిరసలు ఉద్రిక్తతలకు దారి తీస్తున్నాయి.
UGVs At Tibet Border: చైనా అన్ మ్యాన్డ్ గ్రౌండ్ వెహికల్స్ (UGV)లను పెద్ద సంఖ్యలో తయారు చేస్తోంది. వీటిని ఎక్కడినుంచైనా ఆపరేట్ చేయొచ్చు. వీటి కోసం జవాన్లు యుద్ధ భూమిలోకి దిగాల్సిన అవసరం లేదు.
ప్రపంచ పోలీసు క్రీడల ఆతిథ్య దేశంగా భారత్ ఎంపికైంది. ప్రతిష్టాత్మకమైన 2029 ప్రపంచ పోలీస్, అగ్నిమాపక క్రీడలకు అహ్మదాబాద్ వేదిక అయింది. ఆతిథ్య దేశంగా భారత్ ఎంపికవడంతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు.
అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకునే ధైర్యం, సాహసం ఏ దేశానికీ లేదని.. అలాంటి సాహసం తామే చేశామని భారత్లోని ఇరాన్ రాయబారి డాక్టర్ ఇరాజ్ ఇలాహీ తెలిపారు.
ఇరాన్ న్యూక్లియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్షిపణి వ్యవస్థలు, మిలటరీ కమాండ్పై ఇజ్రాయెల్ శుక్రవారం నాడు భీకర దాడులు జరిపింది. 'ఆపరేషన్ రైజింగ్ లయన్' పేరుతో విజయవంతమైన దాడులు జరిపినట్టు నెతన్యాహు ప్రకటించారు. అయితే, ఈ ఉద్రిక్తతల నడుమ ఆయన ప్రధాని మోదీ ఫోన్ చేశారు.
విశాఖ రైల్వేస్టేషన్ అప్గ్రేడేషన్ జరుగుతుందని విశాఖపట్నం ఎంపీ మతుకుమిల్లి భరత్ తెలిపారు. రైల్వే జోన్ పనులు వేగవంతంగా చేస్తున్నామని అన్నారు. ఆంధ్ర యూనివర్సిటీలో మార్పులు చేస్తున్నామని ఎంపీ భరత్ తెలిపారు.