Home » Bharat Ratna
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రప్రభుత్వం భారతరత్న పురస్కారాన్ని ప్రకటించిందని.. అయితే కాంగ్రెస్ ఈ విషయంపై హర్షం ప్రకటించలేదని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు(BJP MP GVL Narasimha Rao) అన్నారు.
దక్షిణాది నుంచి తొలిసారిగా భారతదేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టడమేగాక దేశానికి ఆర్థిక సంస్కరణల పథాన్ని వేసిన తెలుగుబిడ్డ పాములపర్తి వెంకట నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారాన్ని ప్రకటించింది. పీవీతోపాటు మరో
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఇంగ్లీష్ రాదా..? ఎందుకు కనీసం నోరు మెదపలేదు..? జాతీయ మీడియా ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతుంటే కనీసం స్పందించలేదేం..? ఇంతకీ ఇంగ్లీష్ వచ్చా.. రాదా..? ఇప్పుడిదే అటు సోషల్ మీడియాలో.. ఇటు అధికార, ప్రతిపక్ష పార్టీల్లో జరుగుతున్న పెద్ద చర్చ. అసలేం జరిగిందో తెలిస్తే నవ్వుకుంటారేమో. ఇక ఆలస్యమెందుకు రండి మీ కళ్లతో చూసి.. చెవులారా విని తరించండి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న ఇవ్వడం తెలుగు ప్రజలందరూ సంతోషించే విషయమని బీజేపీ ఎంపీ అరవింద్(Aravind) అన్నారు.
మాజీ ప్రధాని స్వర్గీయ పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డు ప్రకటించడం హర్షించ దగిన విషయమని తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.
ఆలస్యమైనా పీవీకు భారతరత్న రావటం చాలా సంతోషంగా ఉందని ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ వాణీదేవి అన్నారు. పీవీ అజాత శత్రువని.. అన్ని పార్టీల్లో నాన్నకు మిత్రులున్నారని చెప్పారు. పీవీ ఆర్థిక సంస్కరణల వల్లే భారతదేశం ఈ స్థితిలో ఉందని చెప్పారు.
దళిత ఐకాన్, బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకుడు కాన్షీరామ్కు దేశ అత్యున్నత పౌర పురస్కారమైన 'భారతరత్న' ఇవ్వాలని ఆ పార్టీ చీఫ్ మాయావతి డిమాండ్ చేశారు. మాజీ ప్రధానులు చౌదరి చరణ్ సింగ్, పీవీ నరసింహారావు, వ్యవసాయ శాస్త్రవేత ఎంఎస్ స్వామినాథన్కు కేంద్ర ప్రభుత్వం 'భారతరత్న' ప్రకటించిన కొద్దిసేపటికే మాయావతి తన డిమాండ్ను తెరపైకి తెచ్చారు.
మాజీ ప్రధాని పీవీ నరసింహారావును భారతరత్నగా కేంద్రం గుర్తించడం పట్ల విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి హర్షం వ్యక్తం చేశారు. భారతరత్నగా పీవీని గుర్తించడం మోదీ గొప్పతనానికి నిదర్శనమని తెలిపారు.
ఒకే ఏడాదిలో ఐదుగురు విశిష్ఠ వ్యక్తులకు దేశ అత్యున్నత పౌర పురస్కారమైన 'భారతరత్న'ను ప్రకటించిన క్రెడిట్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి దక్కుతుంది. ఇది రికార్డు కూడా. 1954లో అవార్డులు స్థాపించిన తరువాత అత్యధికులకు భారతరత్న అవార్డు ప్రకటించిన ఏడాది 2024 కాడం విశేషం.
Sonia Gandhi Reaction on Bharat Ratna Award: దివంగత ప్రధాన మంత్రి, కాంగ్రెస్ నాయకుడు పీవీ నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ లకు శుక్రవారం నాడు కేంద్ర ప్రభుత్వం భారత రత్న అవార్డును ప్రకటించింది. ఈ ముగ్గురు ప్రముఖులకు భారత రత్న ప్రకటించడంపై యావత్ భారతదేశం హర్షం వ్యక్తం చేస్తోంది.