Home » Arrest
నగరంలో.. విదేశీ మహిళలతో వ్యభిచారం నిర్వహిస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. సికింద్రాబాద్ గోపాలపురం పరిధిలో ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిర్వాహాకులను అదుపులోకి తీసుకున్నారు.
ప్రేమించిన అమ్మాయి దక్కలేదని.. ప్రియురాలి భర్తను హత్య చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన కూకట్పల్లి హౌసింగ్ బోర్డు(కేపీహెచ్బీ) పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
TGCSB: తెలంగాణ సహా దేశవ్యాప్తంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్న 20 మందిని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (సీఎస్బీ) అధికారులు అరెస్టు చేశారు. మే నెల 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు రెండు బృందాలు రెక్కీ నిర్వహించి వారిని అరెస్టు చేసినట్టు సీఎస్బీ డీజీ ప్రకటించారు.
టెక్నాలజీని వాడుకుని అడ్డదారుల్లో డబ్బు కొల్లగొడుతున్న ఓ సైబర్ నేరగాడు ఎట్టకేలకు పట్టుబడ్డాడు. ఓ వైద్యుడి నుంచి రూ.1.23 కోట్లు కొట్టేసిన అతగాడిని పోలీసులు అరెస్టు చేశారు. పెరిగిన టెక్నాలజీతో ప్రతిరోజూ ఈ తరహ మోసాలకు పాల్పడుతూ కోట్లాది రూపాయలను కొల్లగొడుతున్నారు. అయితే.. ఏదీ ఎంతకాలం ఆగదుగా.. పాపం పండి చివరకు జైలు జీవితాన్ని గడుపుతున్నారు.
Kavali Pylon Toppling Case: కావలిలో అమృత్ పథకంలో భాగంగా పైలాన్ కూలదోసిన కేసులో నలుగురిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని పోలీసులు విచారణ చేస్తున్నారు. పోలీసుల విచారణలో పలుకీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
గొర్రెల స్కామ్లో కేసు నమోదు అయినప్పటి నుండి మొయినుద్దీన్ ఆయన కొడుకు ఈక్రముద్దీన్ ఇద్దరూ పరరీలోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో మొయినుద్దీన్ హైదరాబాద్ చేరుకోగానే ఇమ్మిగ్రేషన్ సహకారంతో శంషాబాద్ ఎయిర్ పోర్టులోనే అదుపులోకి తీసుకున్నారు. గొర్రెల స్కీమును స్కామ్గా మర్చి రూ. 1200 కోట్ల అవినీతికి పాల్పడ్డారు.
గౌతమ్ గంభీర్ను చంపేస్తానంటూ బెదిరించిన ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. గౌతమ్ గంభీర్ను చంపేస్తానంటూ బెదిరించిన ఇంజినీరింగ్ విద్యార్థిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. గౌతమ్ గంభీర్కు బెదిరింపు మెయిల్స్ పంపిన గుజరాత్కు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి జిగ్నేశ్ సిన్హ్ పర్మార్ (21)గా పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు.
ఒక మహిళ వద్ద పూజలు చేస్తానని చెప్పి అఘోరి రూ. 10 లక్షలు తీసుకుంది. మోసపోయినట్లు గ్రహించిన బాధిత మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చగా న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది.
మీ వీడియో నా దగ్గరుంది.. అది బయటపెట్టకుండా ఉండాలంటే రూ.5 కోట్లు ఇవ్వండి.. అంటూ ఓ ఎమ్మెల్యేను యూట్యూబ్ చానల్ రిపోర్టర్ బ్లాక్మెయిల్ చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ విషయమై ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన వారు అతడిని అరెస్టు చేశారు.
మహిళా సినీ నిర్మాతను మోసగించిన కేసులో అఘోరీని అరెస్టు చేసిన పోలీసులు, లింగనిర్ధారణ పరీక్ష అనంతరం చంచల్గూడ జైలుకు తరలించారు. అతని భార్య శ్రీవర్షిని కస్తూర్బా గాంధీ హోంకు తరలించి, అఘోరీ జైలులో ఉంటాడని పేర్కొన్నాడు