Home » AP Police
నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత జోగి రమేశ్ని ఆదివారం ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. నకిలీ మద్యం కేసులో జోగి రమేశ్ విచారణ పూర్తి అయింది. సుమారు 7 గంటల పాటు జోగి రమేశ్ని సిట్, ఎక్సైజ్ పోలీసులు విచారించారు.
తిరుపతిలో మహిళపై ర్యాపిడో బైక్ డ్రైవర్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. శనివారం అర్ధరాత్రి ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటనపై అలిపిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
విశాఖపట్నంలో ఈగల్ టీం, సిటీ టాస్క్ఫోర్స్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. డ్రగ్స్ తరలిస్తున్నారనే సమాచారం రావడంతో వెంటనే రంగంలోకి దిగి ఆపరేషన్ చేపట్టారు.
కాశీబుగ్గ మృతుల కుటుంబాల బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. ఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించిందన్నారు.
తిరుపతి గరుడ వారధిపై ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు కొనసాగుతున్నాయని తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్ స్పష్టం చేశారు. తిరుపతిలో ప్రతి మలుపు వద్ద బ్లీకింగ్ లైట్లు, రేడియం ఏరో మార్క్స్, సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకున్నామని ఎస్పీ సుబ్బరాయుడు వెల్లడించారు.
వైసీపీ చేస్తున్న ఫేక్ ప్రచారాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫేక్ పార్టీకి ఏమీ దొరకటం లేదని.. వారి జీవితమే ఫేక్ అని సీఎం చంద్రబాబు ఎద్దేవా చేశారు.
మేయర్ దంపతుల హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.
మంత్రి లోకేశ్ ఫొటోను వాట్సప్ డీపీగా పెట్టుకుని.. మోసాలకు పాల్పడుతున్న ముఠాను సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు నిందితులకు కోర్టు 14 రిమాండ్ విధించినట్లు పోలీసులు తెలిపారు.
మెుంథా తుపాన్ దృష్ట్యా అనకాపల్లి జిల్లాలో కలెక్టర్ విజయ కృష్ణన్ మూడు రోజులు సెలవులు ప్రకటించారు. తుపాన్ ప్రభావం దృష్ట్యా జిల్లావ్యాప్తంగా విద్యాసంస్థలకు అక్టోబర్ 27, 28, 29 తేదీల్లో సెలవు ప్రకటిస్తున్నట్లు తెలిపారు.
కర్నూలు వేమూరి ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి కారకుడైన బైకర్ శివశంకర్ బెల్ట్ షాపులో మద్యం తాగాడంటూ వైసీపీకి అనుకూలమైన బ్లూ మీడియాతో సహా కొన్ని మీడియా, సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడమే పనిగా పెట్టుకుంది వైసీపీ అనుకూల మీడియా. అయితే, ఈ ఘటనపై దుష్ప్రచారం చేస్తున్న మీడియా సంస్థలపై ప్రభుత్వం సీరియస్ అయింది.