Home » AP Liquor Rates
ఏపీ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. శుక్రవారం సభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. కల్తీ మద్యంపై సభ్యులు అడిగిన ప్రశ్నకు ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర సమాధానం ఇచ్చారు. కల్తీ మద్యంపై ఏపీ అసెంబ్లీలో వాడీవేడిగా చర్చలు జరుగుతున్నాయి.
ఏపీలో అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారంటూ వస్తున్న ఫిర్యాదులపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు. కాకినాడ జిల్లాతోపాటు రాష్ట్రం నలుమూలల నుంచి ఈ తరహా ఫిర్యాదులు వస్తున్నాయని ప్రస్తావించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్త బార్ పాలసీ నిర్ణయం తీసుకుందని ఎక్సైజ్ కమిషనర్ నిశాంత్ కుమార్ తెలిపారు. 840 బార్లు ఏపీ వ్యాప్తంగా ఉన్నాయని.. పది శాతం కల్లు గీత కులస్థులకు కేటాయిస్తామని పేర్కొన్నారు. కొత్త వారూ ఈ బిజినెస్లోకి రావడానికి కొన్ని మార్పులు చేశామని వివరించారు.
Liquor Rates Hike In Andhra Pradesh : వైసీపీ అధికారంలోకి రాగానే మద్యపానం నిషేధిస్తామని పదే పదే చెప్పిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) .. ప్రభుత్వం ఏర్పాటు చేశాక ఇదే మద్యాన్నే ఆదాయంగా చేసుకుని పరిపాలన సాగిస్తున్నారు..