Home » AP BJP
‘ఎన్నికల్లో పోటీ చేసేందుకు మాకు అవకాశం ఇవ్వాల్సిందే’ అంటూ బీజేపీలో పలువురు నేతలు పార్టీ నాయకత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. టీడీపీ, జనసేనతో పొత్తు కుదరడంతో గెలుపుపై ధీమా పెరిగి.. బీజేపీలో టికెట్లు ఆశిస్తున్న వారి సంఖ్యా పెరుగుతోంది. ఏ సీటు ఖరారైందో అంతర్గతంగా
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. దీంతో బీజేపీ(BJP) పార్టీ చేరికలపై దృష్టి సారించింది. పలు పార్టీల్లోని నేతలను బీజేపీ తమ పార్టీలో చేర్చుకునేలా ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా శ్రీకాకుళం, కాకినాడ, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్ జిల్లా, అనంతపురం జిల్లాల నుంచి వైసీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు బీజేపీలో చేరారు.
ప్రధాని మోదీ, బీజేపీ (BJP) జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఏపీ బీజేపీలోని అసంతృప్తి నేతలు లేఖ రాశారు. తెలుగుదేశం పార్టీ - జనసేన - బీజేపీ ఏపీలో పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ పొత్తులో భాగంగా బీజేపీకి సీట్లు కేటాయింపు, అభ్యర్థుల ఎంపికలో మొదటి నుంచి పార్టీలో ఉన్న నేతలకి అన్యాయం జరుగుతుందని లేఖలో తెలిపారు.
ఏపీలో ఎన్నికలు (AP Elections) సమీపిస్తున్న తరుణంలో.. ఎవరు విజయం సాధిస్తారనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. ఈ నేపథ్యంలోనే.. కొన్ని వార్తా సంస్థలు సర్వేలు నిర్వహించాయి. ఈ సర్వేలు.. ఈసారి టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి (TDP BJP Janasena Alliance) ఘనవిజయం సాధిస్తుందని ఆ సర్వేలు తెలిపాయి. ఈ కూటమి ప్రభంజనం సృష్టించడం ఖాయమని వెల్లడించాయి.
AP Politics 2024: ఆంధ్రప్రదేశ్లో (Andhra Pradesh) ఎన్నికల నోటిఫికేషన్కు చిత్రవిచిత్ర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టికెట్లు దక్కని.. అసంతృప్తు నేతలు, ఆశావహులు జంపింగ్లు చేసే పనిలో నిమగ్నమయ్యారు. మరీ ముఖ్యంగా అధికార వైసీపీలో సిట్టింగులకు టికెట్లు రాకపోవడంతో అటు టీడీపీ.. ఇటు జనసేన కండువాలు కప్పేసుకుంటున్నారు. ఇప్పుడుంతా జంపింగ్లే జరుగుతున్నాయి..
ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి పార్టీ ప్రచార రథాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మేనిఫెస్టో రూపకల్పన కోసం అభిప్రాయ సేకరణ చేపట్టనున్నామని వెల్లడించారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏం ఆశిస్తున్నారనే అంశంపై రెండు బాక్సులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. తొమ్మిది జిల్లాలకు మేనిఫెస్టో రథాలను పంపనున్నట్టు ఆమె పేర్కొన్నారు. ఇక పొత్తులపై జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. టీడీపీ - జనసేన పార్టీలతో పొత్తు ఖరారవ్వడం సంతోషమని వ్యాఖ్యానించారు.
TDP Joins In NDA: తెలుగుదేశం పార్టీతో (Telugu Desam) పొత్తుపై బీజేపీ కీలక ప్రకటన చేసింది. మూడ్రోజుల పాటు ఢిల్లీ వేదికగా బీజేపీ అగ్రనేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సుదీర్ఘ చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. చర్చల అనంతరం పొత్తుపై బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ఓ లెటర్ రూపంలో అధికారిక ప్రకటన చేశారు. ఎన్డీఏలో చేరాలని చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు.
Andhra Pradesh Elections 2024: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో (AP Politics) కీలక పరిణామమే చోటుచేసుకుంది. టీడీపీ-జనసేన (TDP-Janasena) కూటమిలో బీజేపీ (BJP) వచ్చి చేరింది. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా మూడ్రోజులుగా బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డాతో.. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ జరిపిన చర్చలు సఫలమయ్యాయి...
రాబోయే ఎన్నికల్లో బీజేపీ(BJP) ఘన విజయం సాధిస్తుందని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి(Daggubati Purandeswari) అన్నారు. మంగళవారం నాడు బీజేపీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ... ఏపీలో కూడా బీజేపీని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. భస్మాసురుడు తనతలపై చేయి పెట్టుకున్నట్లు 2019లో రాష్ట్ర ప్రజలు సీఎం జగన్ను నెత్తిన పెట్టుకున్నారని చెప్పారు.
టీడీపీ - జనసేనతో పొత్తుపై తమ హై కమాండ్ తుది నిర్ణయం తీసుకుంటుందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి (Daggubati Purandeswari ) తెలిపారు. రెండు రోజుల పాటు బీజేపీ కీలక సమావేశాలు నిర్వహించింది. ఈ సమావేశాలు నేటితో ముగిశాయి. జాతీయ సహ సంఘటనా కార్యదర్శి శివ ప్రకాష్ వరుస సమావేశాల్లో పార్టీ ముఖ్య నేతలు, జిల్లాల్లోని నేతలతో పలు కీలక అంశాలపై చర్చించారు.