Home » AP BJP
ఆజాదికా అమృత మహోత్సవం నుంచి తమ పార్టీ పరంగా ప్రతి సంవత్సరం తిరంగాయాత్రలు నిర్వహిస్తున్నామని బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తెలిపారు. రేపటి నుంచి ఈనెల 14వ తేదీ వరకు తిరంగాయాత్రలు చేపడుతున్నట్లు వెల్లడించారు. తిరంగాయాత్రలు నిర్వహిస్తూ స్థానికంగా స్వాతంత్య్ర సమర యోధుల విగ్రహాలను పరిశుభ్రం చేయాలని సూచించారు.
ప్రజలు తనను ఓడించినందుకు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కాకూడదనే మనస్తత్వంతో మాజీ సీఎం జగన్ ఉన్నారని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో పెట్టుబడులు రాకూడదని జగన్ ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాలకు జగన్ రావాలని... వారి పార్టీ నేతలు లాగా తాము అవహేళనగా మాట్లాడమని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రప్పా రప్పా భాష మాట్లాడమని చెప్పుకొచ్చారు. జగన్ నిర్భయంగా అసెంబ్లీకి రావాలని అక్కడ నిజాలు చెప్పాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ సూచించారు.
ఏపీలో రాయలసీమ ప్రాంతం అత్యంత వెనుకబడిన ప్రాంతంగా మిగిలిపోయిందని బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ వ్యాఖ్యానించారు. ఈ ప్రాంతం నుంచి అనేకమంది ముఖ్యమంత్రులు, రాష్ట్రపతులు వచ్చినా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంత అభివృద్ధికి బీజేపీ కచ్చితంగా కృషి చేస్తోందని పీవీఎన్ మాధవ్ ఉద్ఘాటించారు.
కడప జిల్లాలో బద్వేల్ ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉందని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తెలిపారు. ఒకవేళ ఉప ఎన్నిక వస్తే బీజేపీని గెలిపించుకునేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఏ ఉపఎన్నిక వచ్చినా కూటమి తరపున పోటీ చేసే అభ్యర్థి గెలిచేలా ఉండాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ బలపడాలని, బీజేపీ వాటా బీజేపీకి ఇవ్వాలని కోరారు.
రాబోయే ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ కలసి పోటీ చేస్తాయనే భయాందోళనలతో మాజీ మంత్రి కేటీఆర్ ఉన్నారని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ విమర్శించారు. తెలంగాణలో బీజేపీ, టీడీపీ కలిసి పోటీ చేస్తే కేటీఆర్కి ఏంటి బాధ అని ప్రశ్నించారు. తెలంగాణలో సీఎం రేవంత్రెడ్డికి మద్దతుగా ఉన్నారని రెడ్లను, ఏపీలో చంద్రబాబుకు మద్దతుగా ఉన్నారని కమ్మ కులస్తులను కేటీఆర్ విమర్శించిన మాట నిజం కాదా అని ఎంపీ రమేష్ ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నటించిన సినిమా హరిహర వీరమల్లు విడుదల సందర్భంగా మంత్రులు అభినందనలు తెలిపారు. మంత్రి నారా లోకేష్ను ఆలింగనం చేసుకుని పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు చెప్పారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ మాట్లాడే విధానాన్ని మార్చుకోవాలని.. లేకపోతే తాము తగిన సమాధానం చెబుతామని హెచ్చరించారు.
బీజేపీ ఆంధ్రప్రదేశ్ మీడియా ఇన్చార్జ్, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పాతూరి నాగభూషణానికి అరుదైన గౌరవం దక్కింది.. ప్రతిష్టాత్మక తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (TANA) అందించే విశిష్ట పురస్కారానికి ఆయన ఎంపికయ్యారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ నేతలపై తమిళనాడులో కేసు పెట్టడం మురుగన్పై దాడిగా భావిస్తామని ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు. అన్నామలైకి అండగా పవన్ కల్యాణ్ కూడా రంగంలోకి దిగారని పీవీఎన్ మాధవ్ చెప్పుకొచ్చారు.