Home » AP Assembly Budget Sessions
హైదరాబాద్లో ఉన్న లోటస్ పాండ్, బెంగుళూరులో ఉన్న ప్యాలెస్, మాల్ను ఎన్నికల అఫిడవిట్లో సీఎం జగన్ రెడ్డి ( CM Jagan) ఎందుకు చూపించలేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి (Anam Venkata Ramana Reddy) ప్రశ్నించారు. టీడీపీ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...స్థిరాస్తులే లేని జగన్ కుటుంబానికి లక్షలాది కోట్లా ఆస్తులా.. ? అవి ఎక్కడి నుంచి వచ్చాయని నిలదీశారు.
తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసే పార్లమెంట్ (Parliament), అసెంబ్లీ (Assembly) అభ్యర్థులకు ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ఆదివారం నాడు బీ ఫామ్స్ (B forms) అందజేశారు. బీ ఫామ్స్ అందజేసిన తర్వాత ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులతో చంద్రబాబు ప్రతిజ్ఞ చేయించారు.
Andhrapradesh: ఏపీ శాసనసభ సమావేశాలలో టీడీపీ సభ్యులు ప్రవర్తించిన తీరు అత్యంత హెయమైన చర్య అని ఎమ్మెల్యే మల్లాది విష్ణు వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... ప్రతిరోజు కూడా పోడియం వద్దకి వెళ్లి స్పీకర్ మీద కాగితాలు చించి విసిరేస్తున్నారన్నారు.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ నిరవధికంగా వాయిదా పడింది. శాసనసభను వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ తమ్మినేని సీతారాం తెలిపారు. అయితే శాసనసభలో పార్టీ సభ్యుల లెక్కను చెప్పేటప్పుడు స్పీకర్ తడబడడం గమనార్హం.
Andhrapradesh: ఏపీ అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. శాసనసభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారం ప్రకటించారు. అయితే అసెంబ్లీలో పార్టీల వారీగా సభ్యుల లెక్కలు చెప్పేటప్పుడు స్పీకర్ తడబాటుకు గురయ్యారు.
Andhrapradesh: చివరి రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. కోరం లేని కారణంగా సమయానికి అసెంబ్లీ ప్రారంభం కాని పరిస్థితి. సభా సమయానికి ప్రారంభం కాలేదని టీడీపీ ఎమ్మెల్యేలు అభ్యంతరం తెలిపారు. కోరం లేకపోవడం ఘోరం అంటూ అసెంబ్లీ లాబీల్లో టీడీపీ ఎమ్మెల్యేల కామెంట్లు చేశారు.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గురువారంతో ముగియనున్నాయి. ఈ నెలాఖరులోగా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్నందున.. ప్రస్తుత అసెంబ్లీకి ఇవే చిట్టచివరి సమావేశాలు. రాజ్యసభ ద్వైవార్ష ఎన్నికలకు ఈ నెల 27వ తేదీన పోలింగ్ అనివార్యమైతేనే ఎమ్మెల్యేలు ఇక
ఏపీ అసెంబ్లీలో 2024- 25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బుధవారం శాసనసభలో బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు. ఐదేళ్లుగా బడ్జెట్ను ప్రవేశపెట్టే అవకాశం తనకు దక్కిందన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ సందేశంతో బడ్జెట్ ప్రసంగాన్ని ఆయన ప్రారంభించారు.
Andhrapradesh: ఏపీ అసెంబ్లీలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ప్రసంగం కొనసాగుతోంది. ఇప్పటి వరకూ ఎవరూ చేయని పనులు వైసీపీ ప్రభుత్వం చేసిందని గర్వంగా చెబుతున్నానన్నారు.
Andhrapradesh: దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రాజ్యంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ వంటి దార్శనికుల ఆలోచనలతో వైసీపీ ప్రభుత్వం పాలనను సాగిస్తోందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు.