Home » Andhra Pradesh
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాజధాని అమరావతి ప్రాంతంలోని గ్రామాల్లో ప్రభుత్వ శకటాల ప్రదర్శన సందడి నెలకొంది. అమరావతి పరేడ్ గ్రౌండ్స్లో శనివారం పంద్రాగస్టు వేడుకల్లో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖలు శకటాలను ప్రదర్శించాయి. అనంతరం వాటిని రాజధాని ప్రాంతంలోని గ్రామాల్లో ప్రదర్శించారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అనారోగ్యానికి గురయ్యారు. తీవ్ర జ్వరంతో ఆయన బాధపడుతున్నారు.
దేశ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా విజయవాడలోని లోక్ భవన్లో 'ఎట్ హోమ్' కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఆధ్వర్యంలో ఈ వేడుకను ఏర్పాటు చేశారు.
ఆంధ్రప్రదేశ్లో క్రికెట్ ప్రతిభకు ఆంధ్ర ప్రీమియర్ లీగ్ మంచి వేదికగా నిలుస్తోందని భారత మహిళల మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ అన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్రతిభావంతులైన యువ క్రికెటర్లకు లీగ్ ద్వారా తమ సత్తాను నిరూపించుకునే అవకాశం లభిస్తుందని ఆమె పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలు జారీ అయ్యాయి. పలు జిల్లాల్లో రానున్న మూడు గంటల్లో పిడుగులు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
స్త్రీ శక్తి ఉచిత బస్సు పథకానికి ఏడాది పూర్తైన సందర్భంగా మహిళలతో ముఖ్యమంత్రి చంద్రబాబు బస్సులో ప్రయాణించారు. పరేడ్ గ్రౌండ్స్ నుంచి బస్సులో ప్రయాణించి అనంతరం మహిళలతో సహా క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు.
కులమత, ప్రాంతాలకు అతీతంగా జాతీయ పండుగ జరుపుకుంటున్నామని బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఏపీ వ్యాప్తంగా స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఊరూవాడా అంతటా జాతీయ జెండా రెపరెపలాడింది. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయా నియోజకవర్గాల్లో ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఏపీ రాజధాని అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య వేడుకలను ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని సీఎం చంద్రబాబు జాతీయ జెండాను ఆవిష్కరించారు.
80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలోని సింగ్నగర్ మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ఎన్టీఆర్ జిల్లా తరఫున నిర్వహించిన స్వాతంత్ర్య వేడుకల్లో మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించారు.