Home » Andhra Pradesh
జై భీమ్ రావ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుపై నేరపూరిత బెదిరింపులకు పాల్పడటంతో పాటు మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఇంటింటికీ పెన్షన్ కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్ పాల్గొన్నారు. ప్రజలకు స్వయంగా పెన్షన్లను అందజేశారు.
అనకాపల్లి జిల్లాలోని పాయకరావుపేట నియోజకవర్గంలో హోం మంత్రి వంగలపూడి అనిత పర్యటన కొనసాగుతోంది. పాయకరావుపేట పట్టణంలోని పాత పెద్దిరెడ్డి వారి వీధిలో పెన్షన్లను పంపిణీ చేశారు.
గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో హెడ్కానిస్టేబుళ్లు అశోక్, నాని రిమాండ్ రిపోర్టులో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో పోతర్లంక అశోక్ కుమార్, జంగం నాని నిజాలు చెప్పలేదని పోలీసులు తెలిపారు.
ఏలూరు జిల్లాలో పెద్దపులి సంచారం స్థానిక ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తోంది. వేలేరుపాడు మండలంలోని చింతలపాడు గ్రామ సమీపంలో బుధవారం తెల్లవారుజామున ఓ ఆవుపై పెద్దపులి దాడి చేసి చంపింది.
కాకినాడలో జెనిసెస్ క్యాపిటల్ మేనేజ్మెంట్ సంస్థ వ్యవహారం కలకలం రేపుతోంది. అధిక లాభాల పేరుతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వేలాది మంది నుంచి భారీ మొత్తంలో ఈ సంస్థ పెట్టుబడులు సేకరించింది. గత కొన్ని నెలలుగా చెల్లింపులు నిలిపివేయడంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
మండలంలోని వి. కొత్త కోటకు వెళ్లే దారి పూర్తిగా శిథిలమై గుంతలమయమై ఉండేది. వాహనా ల రాకపోకలకు చాలా ఇబ్బందిగా ఉండేది. కూటమి అధికారంలోకి వచ్చాక టీడీపీ నాయకులు రోడ్డు దుస్థితిని మంత్రి పయ్యావుల దృష్టికి తీసుకెళ్లారు.
ఆంధ్రప్రదేశ్ జ్యుడిషియల్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశారు. అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో రాష్ట్రంలో న్యాయశాఖ ఎదుర్కొంటున్న పలు సమస్యలపై వారు సుదీర్ఘంగా చర్చించారు.
తిరుపతిలో ఓ ఎలుగుబంటి తన పిల్లలతో తిరగడం తీవ్ర కలకలం రేపింది. ఇటీవల తిరుపతి నగర సరిహద్దు ప్రాంతాల్లో వన్యప్రాణుల సంచారం ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది.