Home » Anantapur urban
శ్రీరామనవ మి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోడ్డులోని కాశీవిశ్వేశ్వర కోదండ రామాలయంలో ఏడో రోజున శనివారం బ్రహ్మరథో త్సవాన్ని వైభవంగా నిర్వహిం చారు. ఉదయం సీతారాములకు ప్రత్యేక పూజలు చేసి, మడుగు తేరు లాగారు. అనంతరం ఆల య ఆవరణలో రథాంగహోమం నిర్వహించారు.
రామేశ్వరం నుండి కాశీ వరకు ఆధ్యాత్మిక పాదయాత్ర చేస్తున్న భక్తులను సన్మా నించుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు ఎమ్మెల్యే దగ్గుపాటి వెం కటేశ్వర ప్రసాద్ అన్నారు. కాశీకి 120 రోజుల సుదీర్ఘ పాదయాత్ర చేప ట్టిన తమిళనాడు భక్తులు ఇటీవల జిల్లాలోకి ప్రవేశించారు. అప్పటి నుంచి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో వారికి అవసరమైన భోజనం, వసతి కల్పిస్తున్నారు.
రామగిరి ఎస్ఐ సుధాకర్ యా దవ్పై వైసీపీ చేస్తున్న కుట్ర పూరిత రాజకీయాలను తిప్పి కొట్టడంతో పాటు ఆయనకు అండగా ఉంటామని యాదవ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణస్వామి యాదవ్ అన్నారు. జిల్లా కేంద్రంలో నక్కా రామారావు యాదవ భవనలో గురువారం సాయంత్రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. యాదవ సామాజిక వర్గానికి చెందిన ఎస్ఐ సుధాకర్ నిబద్దతతో విధులు నిర్వహిస్తుంటే, ఆయనపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమన్నారు.
మహాత్మా జ్యోతి బాపూలే 199వ జయంతి వేడుకలను విజయవంతం చేయాలని బీసీ సంక్షేమశాఖ డీడీ కుష్బూకొఠారీ గురువారం ప్రకటనలో కోరారు. శుక్రవారం ఉదయం 9.30 గంటలకు జిల్లా పరిషత ఆవరణంలోని జ్యోతిబాపూలే విగ్రహం వద్ద నివాళులర్పిస్తామన్నారు.
మొదటిరోడ్డులోని కాశీవిశ్వేశ్వర కోదండ రామాలయంలో నిర్వహిస్తున్న శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజున గురువారం రాములవారు గరుడవాహనంపై ఊరేగుతూ దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో ఉదయం సీతారాముల మూలవిరాట్లకు వివిధ అభిషేకాలు, సహస్రనామార్చన నిర్వహించారు.
శ్రీరామనవమి బ్రహ్మో త్సవాల్లో భాగంగా మూ డోరోజున మంగళవారం మొదటిరోడ్డులోని కాశీ విశ్వేశ్వర కోదండ రామా లయంలో రామచంద్రు డు హంసవాహనంపై సరస్వతీదేవి అలంకారం లో ఊరేగారు. ఈ సంద ర్భంగా ఉదయం సీతా రాములకు వివిధ అభి షేకాలు, సహస్ర నామార్చన నిర్వహించారు.
దేశ భవిష్యత్తు, నిర్మాణం యువత చేతుల్లోనే ఉందని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ అన్నారు. మం డలంలోని కురగుంట గ్రామంలో ఆర్ట్స్ కళాశాల ఎనఎస్ఎస్ యూనిట్-2, ఎస్ఆర్ ఎడ్యుకేషన సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన ఎనఎస్ఎస్ స్పెషల్ క్యాంపు మంగళవారం ముగిసింది.
జగనరెడ్డీ... ముందుగా మీ ఇంట్లో వారికి న్యాయం చేసి, ఆ తర్వాత ప్రజల వద్దకు రావాలని ఎమ్మె ల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ సూచించారు. ఆయన మంగళవారం నగరంలోని 11వ డివిజనలో మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమాన్ని నిర్వ హించారు. పాతూరు చెన్నకేశవస్వామి ఆలయం నుంచి ఇంటింటికి వెళ్లి సమస్యలపై ఆరా తీశారు.
శ్రీరామనవమి బ్రహ్మో త్సవాల్లో భాగంగా రెం డో రోజున సోమవారం మొదటి రోడ్డులోని కాశీ విశ్వేశ్వర కోదండ రామా లయంలో రాములవారు సింహవాహనంపై ఊరే గారు. ఈ సందర్భంగా ఉదయం ఆలయంలోని సీతా రాముల మూట విరాట్లకు వివిధ అభిషే కాలు, సహస్ర నామా ర్చన నిర్వహించారు.
డీఆర్డీఏ గెస్ట్హౌస్ శిథి లావస్థకు చేరింది. 1986 జనవరి 20వ తేదీన అప్పటి ఉమ్మడి రాష్ట్ర పరిశ్రమ ల శాఖ మంత్రి రామచంద్రారెడ్డి, అప్ప టి ఉమ్మడి జిల్లా కలెక్టర్ అశోక్కుమార్ తిగిడి చేతుల మీదుగా డీఆర్డీఏ అతిథి గృహాన్ని ప్రారంభించారు.