Home » Ambati Rambabu
సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత అంబటి రాంబాబుపై టీడీపీ నేతలు, కార్యకర్తలు కన్నెర్రజేశారు. తక్షణమే క్షమాపణలు చెప్పాలని.. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు..
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైసీపీ నేత అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి. అంబటి రాంబాబు చంద్రబాబుకు క్షమాపణ చెప్పాలని టీడీపీ శ్రేణులు ఆందోళన చేపట్టారు..
ఇంత పెద్ద వయస్సులో తాను అలా మాట్లాడటం తప్పేనని, టీడీపీ కార్యకర్తల్ని తిట్టి ఉండాల్సింది కాదని వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత అంబటిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
వైఎస్ జగన్ పార్టీ రాజకీయ పార్టీనా లేక రౌడీల పార్టీనా అంటూ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబటిపై జగన్ వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు..
మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత అంబటి రాంబాబుకు గుంటూరులో నిరసన సెగ తగిలింది. చిల్లీస్ సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంపై తెలుగుదేశం నేతలు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఫ్యాన్ పార్టీలో గ్రూపు విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. ఈ క్రమంలోనే పలువురు నేతలు వరుసగా రాజీనామాలు చేయడం సంచలనంగా మారింది.
వైసీపీ నేత అంబటి రాంబాబుపై కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు డమ్మీలు అనటం అంబటికి మంచి పద్ధతి కాదని హితవు పలికారు.
అంబటి రాంబాబుపై పోలీస్ కేసు నమోదు అయింది. పోలీసులను బెదిరించారని, విధులకు ఆటంకం కలిగించారని పేర్కొంటూ BNS 188, 126(2), 851(8), 188(2), రెడ్ విత్ 190 సెక్షన్ల కింద కేసు ఫైల్ అయింది.
వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి రెచ్చిపోయి ప్రవర్తించారు. రోడ్డుపై పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు.
మాజీ మంత్రి అంబటి రాంబాబుపై గుంటూరు ఎస్పీకి గుంటూరు జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ వడ్రాణం హరిబాబు సోమవారం ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో హరిబాబు మాట్లాడారు. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో ఓట్లు రిగ్గింగ్ చేశారంటూ అంబటి రాంబాబు తప్పుడు ప్రచారం చేశారని ఫిర్యాదు చేశారు. మార్ఫింగ్ వీడియోలను పోస్ట్ చేసిన అంబటిపై చర్యలు తీసుకొవాలని విజ్ఞప్తి చేశారు.