Home » Air Pollution
ఢిల్లీలో తీవ్రమైన వాయు కాలుష్యం కారణంగా అక్కడి జనాలు అనారోగ్యం పాలవుతున్నారు. శ్వాస కోశ సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. పిల్లల పరిస్థితి మరింత దారుణంగా ఉంది.
స్వచ్ఛమైన గాలిలో నాణ్యత రోజు రోజుకూ క్షీణిస్తోంది. సెప్టెంబర్ నెలతో పోలిస్తే అక్టోబర్లో వాయు కాలుష్యం మరింత పెరిగినట్టు తాజా అధ్యయనాల్లో వెల్లడైంది. గాలి నాణ్యత లోపించిన ప్రాంతాల్లో హరియాణాలోని ధారుహెరా తొలి స్థానంలో ఉండగా.. దేశ రాజధాని ఢిల్లీ ఈ జాబితాలో ఆరో స్థానంలో నిలిచింది.
దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం తారాస్థాయికి చేరుకుంది. ఢిల్లీ రెడ్ జోన్లోకి వెళ్లిపోయింది. ది డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ చెబుతున్న దాని ప్రకారం ఢిల్లీలో గాలి నాణ్యత పడిపోవటానికి పంట వ్యర్థాలను తగలబెట్టడం ఓ ప్రధాన కారణంగా నిలుస్తోంది. దాదాపు 30 శాతం గాలి కాలుష్యం పంట వ్యర్థాలను తగలబెట్టడం వల్లే జరుగుతోంది.
ఢిల్లీలో గాలి నాణ్యత రోజురోజుకూ క్షీణిస్తోంది. గాలి నాణ్యత సూచీ (AQI) ప్రమాదకర స్థాయిలో నమోదవుతోంది. తాజాగా శనివారం ఉదయం కూడా గాలి నాణ్యత సూచీ పేలవమైన స్థాయిలో నమోదైంది.
పెరుగుతున్న వాయు కాలుష్యం ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారుతోంది. దీని ప్రభావాలు ఊపిరితిత్తులను మాత్రమే కాదు గుండె, మెదడును కూడా దెబ్బతీస్తున్నాయి. కాబట్టి, దీనిని నివారించే మార్గాలు ఏంటో ఆరోగ్య నిపుణుల నుండి తెలుసుకుందాం..
వ్యర్థ పదార్ధాలను తగులబెట్టేందుకు బయోఫ్యూయెల్స్ వాడుతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయని సీజేఐ అన్నారు. రైతులు ప్రత్యేకమైన వారే, వాళ్ల వల్లే మనకు అన్నం దొరుకుతుంది. అలాగని పర్యవారణాన్ని పాడుచేస్తుంటే చూస్తూ ఊరుకోలేం కదా అని ప్రశ్నించారు.
రాష్ట్ర ప్రభుత్వం వాహనాదారులకు షాకిచ్చింది. పలు వాహనాలపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఇది అమల్లోకి రానుంది. ఇంతకు ఏ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.. అందుకు గల కారణాలు ఏంటి అంటే..
దేశ రాజధాని ఢిల్లీలో చాలా నెలల తర్వాత గాలి నాణ్యత మెరుగుపడింది. మూడేళ్ల తర్వాత నిన్న కాలుష్య స్థాయి తగ్గిపోయి, గాలి నాణ్యత పెరిగింది. అయితే ఏ మేరకు తగ్గిందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
ఉత్తరాది రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. దేశ రాజధాని ఢిల్లీ, జమ్ము కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. ఢిల్లీలో ఈ సీజన్లో అత్యంత శీతల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలికి తోడు ఢిల్లీలో వాయు కాలుష్యం అధ్వాన స్థితిలోనే కొనసాగుతోంది.
ఢిల్లీలో కాలుష్యం తగ్గిన నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆంక్షలను తగ్గించేందుకు అనుమతి ఇస్తూనే, తదుపరి పర్యవేక్షణ అవసరమని కోర్టు స్పష్టం చేసింది. ఈ క్రమంలో స్కూళ్లు ఫిజికల్ విధానంలో మళ్లీ ప్రారంభించాలని తెలిపింది.