Home » Air india
గుజరాత్లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్లోని గాట్విక్కు బయలుదేరిన ఎయిరిండియా బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానం(ఏఐ-171) కూలిపోయిన ఘటనలో 290మంది దుర్మరణంపాలయ్యారు.
పెళ్లి అనంతరం మొట్టమొదటిసారి తన భర్తను కలవబోతుందన్న ఆమె కల (Newlywed Bride) నెరవేరలేదు. ఆతృతతో, ఆనందంతో ఆమె గగనతలంలో ప్రయాణానికి సిద్ధమైంది. కానీ అంతలోనే విషాదం అలుముకుంది. చిరునవ్వుతో మొదలైన ఆ ప్రయాణం, చివరకు కన్నీటి కథగా మిగిలిపోయింది. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో ఓ నవ వధువు మరణించినట్లు తెలుస్తోంది.
అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్కు బయల్దేరిన ఎయిరిండియా విమానం కొన్ని సెకెన్లలోనే కూలిపోయిన సంగతి తెలిసిందే. మొత్తం 242 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానం ఒక్కసారిగా కూలిపోయి మంటల్లో చిక్కుకుంది.
అహ్మదాబాద్ విమానాశ్రయంలో విమానం టేకాఫ్ అయిన దగ్గర్నుంచి కూలిపోయేంత వరకు ఏ జరిగిందో కళ్లకు కట్టినట్టు చూపించే వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మొత్తం 242 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఎయిరిండియా విమానం ఒక్కసారిగా కూలిపోయి మంటల్లో చిక్కుకుంది. భారీ ప్రాణనష్టం సంభవించింది. ఈ విమానంలో ప్రయాణిస్తున్న అందరూ ప్రాణాలు కోల్పోయారని వార్తలు వచ్చాయి. అయితే ఒక్క వ్యక్తి అంత పెద్ద దుర్ఘటన నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు.
అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఎయిర్ ఇండియా ఫ్లైట్ గురువారం మధ్యాహ్నం కుప్పకూలింది. ప్రమాద సమయంలో విమానంలో 242 మంది ఉన్నారు. అయితే ఈ ఘటనలో మరణించిన బాధిత కుటుంబాలకు పరిహారం ఎంత (Air India Crash Compensation) వస్తుందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
లండన్లో చదువుకుంటున్న తన కూతురిని చూసేందుకు విజయ్ రూపాని ఎయిరిండియా విమానంలో పయనమయ్యారు. విమానంలో ఆయన కూర్చున్న ఫొటో ఒకటి బయటకు వచ్చింది. వేరే ప్రయాణికురాలు విమానంలో తన సీటులో కూర్చున్న విజయ్ రూపానిని ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
గుజరాత్ అహ్మదాబాద్లో 242 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానం గురువారం మధ్యాహ్నం ఆకస్మాత్తుగా కూలిపోవడంతో దేశవ్యాప్తంగా తీవ్ర విషాదం నెలకొంది. ఈ సందర్భంగా గతంలో దేశంలో చోటుచేసుకున్న కొన్ని ప్రధాన విమాన ప్రమాదాలను (Top 10 Flight Accidents india) ఒకసారి పరిశీలిద్దాం.
విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానాశ్రయ సమీపంలో ఉన్న డాక్టర్ల హాస్టల్లోకి దూసుకెళ్లి కూలిపోయింది. వెంటనే ఆ ప్రాంతంలోఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. బిల్డింగ్ లో ఉన్న 20మంది డాక్టర్లు చనిపోయినట్టు సమాచారం.
Air India Flight Ticket Offer: జీవితంలో ఒక్కసారైనా విమానం ఎక్కాలనేది మీ కలా.. అయితే, మీ కోరిక తీరేందుకు ఇదే మంచి ఛాన్స్.. వెంటనే ఎయిరిండియా లాంచ్ చేసిన మెగా సేల్లో టికెట్ బుక్ చేసుకోండి. బస్సు లేదా రైలు టికెట్కు అయ్యే ఖర్చుతోనే ఫ్లైట్ ఎక్కేయండి. డిసెంబర్ 10, 2025 వరకూ దేశవిదేశాల్లో ఎక్కడికైనా అతితక్కువఖర్చుతోనే విమాన ప్రయాణం చేసే అవకాశం మిస్సవకండి.