Home » Air india
ఢిల్లీ నుంచి బాలికి బయలుదేరిన ఎయిరిండియా విమానం AI2145ను భద్రతా కారణాల రీత్యా వెనక్కి తిరిగి రావాలని సూచించామని, విమానం సురక్షితంగా ఢిల్లీకి చేరిందని ఎయిరిండియా ప్రతినిధి ఒకరు తెలిపారు.
అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం ఇప్పుడు భీమా కంపెనీలకు చెమటలు పట్టిస్తోంది. ఎందుకంటే.. ఇది దేశంలోనే అత్యంత ఖరీదైన క్లెయిమ్లలో ఒకటి. బీమా కంపెనీలు చెల్లించాల్సిన మొత్తం దాదాపు..
గత కొన్ని రోజులుగా సాంకేతిక సమస్యలు సహా పలు కారణాలతో అనేక విమానాలు రద్దు కావడం వంటి విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే అసలు ప్రపంచవ్యాప్తంగా సేఫెస్ట్ విమానయాన సంస్థలు (Safest Airlines) ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
అహ్మదాబాద్ ఘోర ప్రమాదం తర్వాతి నుంచి.. విమానాల్లో వరుసగా సాంకేతిక సమస్యలు, వెనక్కి మళ్లించడాలు, అత్యవసర ల్యాండింగ్ వంటివి ఆందోళన రేపుతున్నాయి. వరుసగా మరిన్ని ఘటనలు జరుగుతున్నాయి.
భారత ఏవియేషన్ చరిత్రలోనే అతి పెద్ద విషాదం జూన్ 12న అహ్మదాబాద్లో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 270 మందికి పైగా మరణించారు. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్కు బయల్దేరిన ఎయిరిండియా విమానం కొన్ని సెకెన్లలోనే కూలిపోయిన సంగతి తెలిసిందే.
ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని, సాధ్యమైనంత త్వరలో ప్రయాణికులను వారి గమ్యాలకు చేర్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని ఏఐ ప్రతినిధి చెప్పారు.
ఏఐ-159 బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానం షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 1.10 గంటలకు బయలుదేరాల్సి ఉండగా, తనిఖీలు చేపట్టారు. సాంకేతిక లోపం తలెత్తడంతో వెంటనే సర్వీసును నిలిపివేశారు.
ఆకాశంలో విహరించాల్సిన విమానాలు, ఇప్పుడు భూమిపైనే ఆగిపోతున్నాయి. ఇటీవల కాలంలో పలు రకాల సాంకేతిక సమస్యల వల్ల ఈ రంగం వెనక్కి సాగుతోంది. ఈ క్రమంలో ప్రయాణికుల భద్రత దృష్ట్యా అనేక ఫ్లైట్లు రద్దు (Air India Flights) అవుతున్నాయి. చివరి నిమిషంలో మళ్లీ వెనక్కి మళ్లుతున్నాయి.
ఘటనా స్థలి నుంచి రమేష్ బయటకు వస్తుండగా ఆ వెనుక విమానం కాలిపోతున్న దృశ్యాలు పెద్దఎత్తున పొగ చుట్టుపక్కల వ్యాప్తించడం కనిపిస్తోంది. ప్రమాదంలో గాయపడిన అతనిని చూసి కొందరు అతన్ని అక్కడి నుంచి తరలించడం వీడియోలో చోటుచేసుకుంది.
విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం తలెత్తడంతో సేఫ్టీ ప్రోటాకాల్కు అనుగుణంగా విమానాన్ని హాంగ్కాంగ్కు పైలట్ తిరిగి మళ్లించారు.