Home » Afghanistan
టీమిండియా, శ్రీలంక, పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్తాన్ ఈ ప్రపంచకప్లో ఆసియా నుంచి ఆడుతున్న జట్లుగా నిలిచాయి. వన్డే ప్రపంచకప్లో ఆసియా జట్ల రికార్డులు చెక్కుచెదరకుండా అలాగే కొనసాగుతుండటం గమనించాల్సిన విషయం.
అఫ్గానిస్థాన్ను వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. వారం రోజుల వ్యవధిలోనే నాలుగో సారి భూకంపం సంభవించింది. ఇప్పటికే వేలాది మంది ప్రజలు చనిపోయారు.
వన్డే ప్రపంచకప్లో భాగంగా ఢిల్లీ వేదికగా ఆప్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో గెలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానాన్ని ఆక్రమించింది.
ఢిల్లీ వేదికగా జరుగుతున్న టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆప్ఘనిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది.
ప్రస్తుతం వన్డే ప్రపంచకప్లో ఆడుతున్న స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ మంచి మనసు చాటుకున్నాడు. తన ప్రపంచకప్ ఫీజు మొత్తాన్ని భూకంప బాధితులకు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు.
అఫ్గానిస్థాన్లో(Afghanistan) సంభవించిన భారీ భూకంపం (Earthquake) పెను విధ్వంసాన్నే సృష్టించింది. ఈ విపత్తులో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు 2 వేల 445 మంది భూకంపం ధాటికి శిథిలాల్లో చిక్కుకుపోయి చనిపోయారని వెల్లడించారు.
ఆప్ఘనిస్థాన్లో సంభవించిన భూకంపం పెను విషాదాన్ని మిగిల్చింది. ఒక సారి రెండు సార్లు కాదు.. ఏకంగా ఏడు సార్లు భూమి కంపించడంతో పశ్చిమ ఆఫ్ఘనిస్థాన్ కకావికలమైపోయింది. అందులో ఐదు సార్లు భూప్రకంపనలు తీవ్ర స్థాయిలో వచ్చాయి.
అఫ్గనిస్తాన్ లో శనివారం మధ్యాహ్నం భారీ భూకంపాలు(Earthquake) సంభవించాయి. దేశంలోని పశ్చిమ ప్రాంతంలో 6.1, 5.9 తీవ్రతతో ఇవి తీవ్రతను నమోదు చేశాయి. 12:11కి 6.1 తీవ్రతతో, 12:19కి 5.9 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ(Seismology) తెలిపింది. హెరాత్ నగరానికి వాయువ్యంగా 40 కిలోమీటర్ల దూరంలో భూకంప కార్యకలాపాల కేంద్రాన్ని గుర్తించారు.
మన దేశంలో నేటి నుంచి ఆఫ్ఘనిస్థాన్ రాయబార కార్యాలయం మూతపడనుంది. భారతదేశంలో నేటి నుంచి తమ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేస్తున్నట్టు ఆఫ్ఘనిస్థాన్ ఎంబసీ ప్రకటించింది.
ఆఫ్గనిస్తాన్(Afghanisthan) దేశాన్ని తాలిబన్లు వశపరుచుకున్న తరువాత అక్కడ మానవ స్వేచ్ఛ ప్రశ్నార్థకంగా మారిందని పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ప్రశ్నించేవారిని అణిచివేయడం.. ఎదురెళ్లినవారిని కాలగర్భంలో కలిపేయడం ఇదే తంతు. ఆ దేశాన్ని తాలిబన్లు(Talibans) పాలించి 19 నెలలు కావస్తుండగా ఇప్పటి వరకు మానవ హక్కుల(Human Rights) ఉల్లంఘనలో ఆ దేశం కొత్త రికార్డులు లిఖిస్తోంది.