Home » Adilabad
ఊరి కోసం ఎంతో చేయడమే కాక, కష్ట సమయంలో తమకు అండగా నిలిచిన వ్యక్తి ప్రాణాపాయంలో ఉన్నాడని తెలిసి ఆ ఊరంతా ఒక్కటైంది. ప్రాణాపాయంలో ఉన్నది ముస్లిం అయినా సరే..
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మంచిర్యాల జిల్లా, నస్పూర్ మున్సిపాలిటీలోని తీగల్ పహాడ్ పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. స్థానిక ఎస్ఐ కాంగ్రెస్కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని స్థానిక బీజేపీ నేత కమలాకరరావు పేర్కొంటూ ఎస్ఐతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఎస్ఐ బీజేపీ నేతపై దాడి చేశారంటూ బీజేపీ కార్కకర్తలు ఆందోళనకు దిగారు.
ఓ 70 ఏళ్ల వృద్ధుడు.. 32 ఏళ్ల వయస్సు ఉన్న అతని కుమారుడు.. తమ పక్కింటిలో ఉండే నిండా 13 ఏళ్లు లేని ఓ బాలిక పట్ల కీచకులుగా మారారు. మానసిక ఆరోగ్యం సరిగా లేని చిన్నారి అని కూడా చూడకుండా వేర్వేరుగా అత్యాచారానికి తెగబడి ఆ బాలిక బాల్యాన్ని చిదిమేశారు.
ఆదిలాబాద్ జిల్లాలో తోయగూడ గ్రామస్థులు బతుకు దెరువు కోసం.. వివిధ ప్రాంతాలకు వలస వెళ్లారు. ఇలా ఎక్కడెక్కడో నివాసం ఉన్న సుమారు 500 మందికిపైగా 40 ఏళ్ల తర్వాత ఖాళీ చేసిన గ్రామ శివారులో కలుసుకున్నారు. ఒకరికొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. అందరూ కలిసి భోజనాలు చేశారు.
ఆదివాసీల ఆరాధ్య దైవం, రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ నాగోబా మహా జాతరకు అంతా సిద్ధమైంది.
అప్పు లు తెచ్చి ఎన్నోఆశలతో సాగు చేసిన పంటలు దిగబడి రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన రైతు బల వన్మరణానికి పాల్పడ్డాడు.
ఆదివాసుల ఆరాధ్య దైవం జంగుబాయి దర్శనానికి వెళ్తున్న యాత్రికుల వాహనం లోయలోకి బోల్తా పడిన ఘటనలో ఒకరు మృతి చెందగా, 59 మంది గాయపడ్డారు.
మూడు దశాబ్దాలకు పైగా గూడెం గ్రామంలో ఎన్నికలు జరగడం లేదు. గ్రామంలో ఒక్క గిరిజనుడు లేకపోయినా సర్పంచ్ పదవితోపాటు ఐదు వార్డు స్థానాలను షెడ్యూల్డ్ ట్రైబ్స్ (ఎస్టీ) కులస్థులకు రిజర్వ్ చేశారు. ఎన్నికలు జరిగిన ప్రతిసారి నోటిఫికేషన్ ఇవ్వ డం, నామినేషన్లు దాఖలు కాకపోవడం షరా మామూ లైంది. త్వరలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఈసారైనా గ్రామ పంచాయతీ రిజర్వేషన్ మారుతుందని గ్రామస్థులు ఆశిస్తున్నారు.
మందమర్రి మున్సిపాలిటీ ఎన్నికలకు కట్టుబడి ఉన్నానని, పాలకవర్గం లేకపోవడంతో ప్రజలకు జవాబుదారిగా పనిచేస్తున్నానని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తెలిపారు. ఆదివారం మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో అభివృద్ధి పనులపై సమావేశం నిర్వహించారు. పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.
కవ్వాల టైగర్ జోన్లోని జన్నారం డివిజన్లో ఆదివారం నిర్వహించిన బర్డ్వాచ్ ఆకట్టుకొంది. 15 మంది పర్యాటకులు శనివారం రాత్రి అటవీ ప్రాంతంలో బస చేసి, ఆదివారం తెల్లవారుజామున పక్షులను లెన్స్ కెమెరాల ద్వారా వీక్షించారు.