Home » ABN Andhrajyothy
ప్రస్తుతం సమాజంలో కనిపిస్తున్న రాజకీయాలను యువత ఏవగించుకుంటున్నారని ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. గోవాలో పశ్చిమ ప్రాంత కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ సదస్సులో స్పీకర్ అయ్యన్నపాత్రుడు పాల్గొన్నారు.
నేటి సమాజం.. సర్వం సోషల్ మీడియా మయం. మారుతున్న కాలంలో సోషల్ మీడియా వినియోగం విపరీతంగా పెరిగిపోతోంది. దాని దుష్ప్రభావాల నుంచి భావి తరాలను కాపాడుకోవాలని మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు.
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్పై టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమాహేశ్వరరావు మరోసారి నిప్పులు చెరిగారు. ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చి పరదాలు కట్టుకుని తిరిగారని.. తాడేపల్లి ప్యాలెస్ దాటి బయటకు రాలేదంటూ జగన్ ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు.
ముంబై నగరంలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం టెర్మినల్ 1 బిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వివరాల్లోకి వెళితే..
కాంగ్రెస్ పార్టీని టి. జీవన్ రెడ్డి వీడడం బాధాకరమని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి. జగ్గారెడ్డి తెలిపారు. గురువారం సంగారెడ్డిలో జగ్గారెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడైన ఆయన.. సోనియా, రాహుల్ గాంధీ కుటుంబానికి విధేయుడిగా ఉండేవారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
విద్యార్థి నాయకుడి కిడ్నాప్ కేసులో తదుపరి విచారణ జరిపే వరకు ప్రముఖ సినీ నటుడు ఎం. మోహన్ బాబుపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని తిరుపతి పోలీసులను ఏపీ హైకోర్టు ఆదేశించింది. కేసు సీడీని తమ ముందు ఉంచాలని వారికి కోర్టు స్పష్టం చేసింది.
తెలంగాణ ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని సోషల్ మీడియాలో తెగ వార్తలు వస్తున్నాయి. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు అయోమయంలో పడ్డారు.
అసోం, కేరళం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. గురువారం సాయంత్రం 5 గంటలకు ఆయా రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసింది. ఇప్పటి వరకు పుదుచ్చేరిలో 86.92 శాతం, అసోంలో 84.42 శాతం, కేరళంలో 75.01 శాతం పోలింగ్ నమోదు అయిందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భవానీ పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న మమతా బెనర్జీ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. మమతా బెనర్జీ సమర్పించిన అఫిడవిట్లో ఆస్తి వివరాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. వివరాల్లోకి వెళితే..
వ్యవసాయ శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు దిగజారి మాట్లాడుతున్నారని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు ఖండించడానికి తాను మీడియా ముందుకు రాలేదన్నారు.