Home » ABN Andhrajyothy Effect
టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు గురించి పార్లమెంటులో ఎంపీ గల్లా జయదేవ్ ప్రస్తావించించారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే చంద్రబాబు అరెస్ట్ చేశారని ఆయన ఆరోపించారు.
లోక్సభలో వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఖండించారు. పార్లమెంట్ అన్నది కూడా మరిచిపోయి పులివెందుల పంచాయతీ మాదిరిగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
విశాఖలో వినాయక చవితిని ఘనంగా జరుపుకుంటున్నారు. వినాయక చవితిని పురస్కరించుకుని విశాఖలో వివిధ రూపాలలో గల గణనాధులను ఏర్పాటు చేశారు.
టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు జైలు నుంచి బయటికి రాగానే అధికారికంగా టీడీపీలో చేరతానని వైసీపీ రెబల్, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ప్రకటించారు.
నీళ్ళు, నిధులు నియామకాలు అనేది తెలంగాణ ప్రజల స్లోగన్ కాదని, అది కేసీఆర్ స్లోగన్ అని టీ-పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజలు కోరుకున్నది స్వేచ్ఛ, ఆత్మ గౌరవం అని ఆయన చెప్పారు.
పార్లమెంట్ సాక్షిగా టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడుపై వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ వేదికగా తన నోటి దూలను ప్రదర్శించారు.
సిరాజ్ అద్భుత ప్రదర్శనపై ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర ప్రశంసలు కురిపించారు. ఎక్స్(ట్విట్టర్) వేదికగా సిరాజ్ను కొనియాడారు.
వినాయకచవితి సందర్భంగా సెప్టెంబర్ 19 నుంచి రిలయన్స్ జియో టెలికాం కంపెనీ జియో ఎయిర్ ఫైబర్ను ప్రారంభించనుంది. ఈ విషయాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ కంపెనీ 2023 ఏజీఎమ్ సందర్భంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
51 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా ఓపెనర్లు 6.1 ఓవర్లోనే పూర్తి చేశారు. దీంతో ఏకంగా 263 బంతులు మిగిలి ఉండగానే 10 వికెట్ల తేడాతో టీమిండియా ఘనవిజయం సాధించింది. ఈ క్రమంలో భారత జట్టు 23 ఏళ్ల క్రితం శ్రీలంక చేతిలో ఎదురైన ఘోరపరాజయానికి ప్రతీకారం తీర్చుకుంది.
ఆసియా కప్ 2023 విజేతగా భారత్ నిలిచింది. అతిథ్య జట్టు శ్రీలంకతో ఏకపక్షంగా జరిగిన ఫైనల్ పోరులో టీమిండియా 10 వికెట్లతో తేడాతో ఘనవిజయం సాధించింది.