వెస్ట్ వర్జీనియాలోని ప్యాలెస్ ఆఫ్ గోల్డ్ ఆధ్యాత్మిక కేంద్రానికి బయలుదేరిన నలుగురు భారత సంతతి వృద్ధులు కనిపించకుండా పోయిన ఉదంతం కలకలం రేపుతోంది. పోలీసులు వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.
శాన్ జోస్లో ఇండియన్ కాన్సులర్ అప్లికేషన్ సెంటర్ను అమెరికాలో భారత రాయబారి (అంబాసిడర్ ఆఫ్ ఇండియా ఇన్ యూఎస్ఏ) వినయ్ క్వాత్రా వర్చువల్గా ప్రారంభించారు.
హైదరాబాద్లో కాన్సుల్ జనరల్గా త్వరలో బాధ్యతలు చేపట్టనున్న అమెరికా అధికారి లారా విలియమ్స్ గౌరవార్థం అమెరికాలో భారత సంతతి ప్రముఖులు ప్రత్యేక విందును ఏర్పాటు చేశారు. భారత్, అమెరికాల మధ్య దౌత్య బంధం బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా లారా విలియమ్స్ హామీ ఇచ్చారు.
ఒక్క ఏడాది.. ఏకంగా రూ.22,842 కోట్లు.. 2024-25 ఆర్థిక సంవత్సరంలో సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కి భారతీయులు పోగొట్టుకున్న
తానా పాఠశాల ఆధ్వర్యంలో వాషింగ్టన్ డీసీలో ప్రముఖ కవి, జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత డా. సి. నారాయణ రెడ్డి 94వ జయంతి వేడుక వైభంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు ప్రముఖులు సినారె రచనల విశిష్ఠతను ప్రశంసించారు.
దేశం కోసం ఏమైనా చెయ్యాలి అనే తన కోరిక నెరవేరలేదని, ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజీలో సీటు దక్కలేదని, అయితే ఒక రేడియో వ్యాఖ్యాతగా, ఆ కలని సాకారం చేసుకునే అవకాశం లభిస్తుందని ఊహించలేద టోరీ రేడియో వ్యాఖ్యాత జయ పీసపాటి పేర్కొన్నారు. తన రేడియో షో పేరు జై హింద్ అని చెబుతూ ఆ పేరు ఎంచుకున్నందుకు గల కారణాలను వివరించారు.
చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన నేరంపై అమెరికాలో భారత సంతతి పైలట్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విమానం ల్యాండవగానే అతడిని అరెస్టు చేశారు. నిందితుడు డెల్టా ఎయిర్లైన్స్లో పనిచేస్తున్నాడు.
సెప్టెంబర్ 2 నుంచి అమెరికా వీసా ఇంటర్వ్యూ వైవర్ విధానం రద్దు కానుంది. దీంతో, వీసా రెన్యూవల్ మరింత కఠినంగా మారే అవకాశం ఉందన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. హెచ్-1బీ వీసాదారులు, వారి కుటుంబసభ్యులకు ఇక్కట్లు ఎక్కువయ్యే ఛాన్స్ ఉంది.
శక్తిమంతమైన పాస్పార్టుల జాబితాలో భారత్ ఈసారి 77వ స్థానంలో నిలిచింది. ప్రస్తుతం 59 దేశాలు భారతీయులకు వీసా ఫ్రీ ఎంట్రీకి అవకాశం ఇస్తుండటంతో భారత పాస్పోర్టు ర్యాంకు గతంలో కంటే మెరుగుపడింది. మరి ఏయే దేశాలు భారత్కు ఈ అవకాశం ఇస్తున్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.
దుబాయిలో భవనాలకు రంగులు వేసే ఒక సంస్థలో పెయింటర్లుగా పని చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 12మంది పశ్చిమ గోదావరి జిల్లా యువకులు వెళ్లారు. అయితే దుబాయిలో వారు పనిచేసే యజామానితో వివాదం ఏర్పడ్డింది. దీంతో 12మంది యువకులు స్వదేశానికి తిరిగి వచ్చారు.