జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీ గరీయసి.. ఏ తల్లి నిను కన్నదో.. ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా అంటున్నారు పార్వతీపురం మన్యం జిల్లాలోని ఓ కుగ్రామ ప్రవాసీయులు. సరైన కనీస మౌలిక వసతులు కూడా కరువైన గరుగుబిల్లి మండలం రావుపల్లి గ్రామానికి చెందిన కొంతమంది యువకులు ప్రపంచంలో అత్యధిక చమురును ఉత్పత్తి చేసే సౌదీ అరేబియా అదే విధంగా ప్రపంచంలోకెల్లా ఎక్కువగా గ్యాస్ ఉత్పత్తి చేసే ఖతర్ దేశాల్లోని చమురు, గ్యాస్ ఉత్పాదక సంస్థల్లో సమర్థవంతమైన నిపుణులైన ఇంజినీర్లుగా వెలుగొందుతున్నారు ఈ కుగ్రామ బిడ్డలు.
మినియాపోలిస్ ఇండియా ఫెస్ట్లో భాగంగా 79వ భారతదేశ స్వాతంత్య్ర దినోత్సవాల సంబరాల్లో తానా నార్త్ సెంట్రల్ టీం పాల్గొని తానా పాఠశాల సభ్యత్వం నమోదు విశిష్టత తెలుపుతూ కార్యక్రమం నిర్వహించారు.
ఇంటెల్ సంస్థకు చెందిన సీక్రెట్ డాక్యుమెంట్స్ను మైక్రోసాఫ్ట్కు లీక్ చేసిన కేసులో అమెరికాలోని భారత సంతతి ఏఐ ఇంజినీర్కు స్థానిక కోర్టు ఏకంగా 34,472 డాలర్ల జరిమానా విధించింది. రెండేళ్ల పాటు ప్రొబేషన్లో ఉండాలని తీర్పు వెలువరించింది.
సాకేత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫ్రిస్కోలో 5కే వాక్ జరిగింది. ఈ ఈవెంట్లో పాల్గొన్న ఎన్నారైలు సుమారు రూ.13 లక్షల విరాళాలు అందజేశారు.
అమెరికా వ్యాప్తంగా ఉన్న ఎన్నారైలు భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నారు. తాజాగా మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సస్ ఆధ్వర్యంలో డాలస్లో స్వాతంత్ర్య దినోత్సవం వైభవంగా జరిగింది.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను అవామానించేలా పోస్టులు పెట్టిన ఓ కేరళ ఎన్నారైపై తాజాగా కేసు నమోదైంది. స్థానిక బీజేపీ నేత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. త్వరలో సైబర్ పోలీసులకు కేసును బదిలీ చేస్తామని తెలిపారు.
తానా పాఠశాల ఆధ్వర్యంలో అమెరికాలో 79వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఆముదాలవలస శాసనసభ్యులు కూన రవికుమార్, మిర్చియార్డ్ మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
అసోసియేషన్ అఫ్ ఇండో అమెరికన్స్ ఆధ్వర్యంలో 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు కాలిఫోర్నియాలో వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రదర్శించిన తానా స్వర్ణోత్సవ శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
రాజధాని రియాధ్ కేంద్రంగా కీలకంగా వ్యవహారించే సాటా సెంట్రల్ ప్రతినిధులు మంగళవారం ముఖ్యమంత్రి యన్. చంద్రబాబు నాయుడును అమరావతిలోని సచివాలయంలో కలిశారు. సాటి తెలుగు వారి కోసం సాటా సెంట్రల్ చేస్తున్న సేవలను వివరించారు. టీడీపీ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న వైనాన్ని సీఎంకు చెప్పారు.
సింగపూర్లో శ్రీ సాంస్కృతిక కళాసారథి ఆధ్వర్యంలో మహా సహస్రావధాని డా. మేడసాని మోహన్ ప్రవచనామృతం ఆకట్టుకుంది. స్థానిక ఎన్నారైలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.