Home » Andhra Pradesh » Kadapa
నాన్న గొడ్డలిపోటుతో పడిఉంటే.. గుండెపోటు అని చెప్పారని సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులను బెదిరించి క్రైమ్ సీన్ను తుడిచేసారని ఆరోపించారు. హత్య తరువాత కొందరు వ్యక్తులు లెటర్ తీసుకువచ్చి ఆదినారాయణ రెడ్డి, సతీష్ రెడ్డి, బిటెక్ రవి హత్య చేసారని తనని సంతకం పెట్టామన్నారని ఆమె తెలిపారు
వైసీపీ నేతలు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, సతీష్ రెడ్డిలపై పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు. అవినాష్, సతీష్లు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి అనుమతి లేకుండా అధిక సంఖ్యలో కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించారని ఎంపీడీవోకు కొంతమంది ఫిర్యాదు చేశారు.
మాజీ సీఎం జగన్ మాటలతో జిల్లాలో వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారని వివేకా హత్య కేసు సాక్షి దస్తగిరి అన్నారు. మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, తమ్ముడు అహ్మద్ బాషా అండతో.. రాయచోటిలోని జగన్ అనుచరులు భూకబ్జాలు చేశారని ఆరోపించారు
కడప జిల్లాలో ఈ నెల 12న జరగనున్న పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు ఎవరో తేలిపోయింది. పులివెందుల నుంచి 11 మంది పోటీ చేస్తుండగా ఒంటిమిట్ట నుంచి కూడా 11 మందే బరిలో ఉన్నారు. పులివెందుల టీడీపీ అభ్యర్థిగా మారెడ్డి లతారెడ్డి, వైసీపీ నుంచి తుమ్మల హేమంత్రెడ్డి, కాంగ్రెస్ నుంచి మొయిళ్ల శివకళ్యాణ్ రెడ్డి పోటీలో ఉన్నారు.
వివేకా హత్యకేసుపై మంగళవారం నాడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా సీబీఐ అధికారులు కోర్టు ముందు తమ వాదనలు వినిపించారు. ఈ కేసులో దర్యాప్తు ముగిసిందని సీబీఐ అధికారులు సుప్రీంకోర్టుకు స్పష్టం చేశారు.
మాజీ సీఎం జగన్ సెక్యూరిటీపై వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఇచ్చిన సెక్యూరిటీతో పాటు ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసింది. జగన్ భద్రత కోసం మరో నలభై మంది ప్రైవేట్ సెక్యూరిటీ నియమించింది.
జమ్మలమడుగులోని పర్యాటక ప్రాంతమైన గండికోటలో బాలిక హత్య కేసు మిస్టరీగానే మిగిలిపోతోంది.
శివుడు కొలువుదీరిన చోటు శ్మశానం అనే నమ్మకం హిందువుల్లో నెలకొని ఉంది.
పేదవర్గాల వారిని ఆదుకునే కార్యక్ర మమే పీ4 అని బద్వేలు ఆర్డీవో చంద్రమోహన పేర్కొన్నారు.
బొప్పాయి మధ్య దళారీ వ్యవస్థను రద్దు చేసి కిలోకు రూ.16 చెల్లించాలని రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్రెడ్డి డిమాండ్ చే శారు.