ఎస్‌బీఐపై తెలంగాణ సర్కార్ సీరియస్..

ABN, Publish Date - Jun 22 , 2026 | 05:06 PM

తెలంగాణ సచివాలయంలో సీఎస్‌తో ఎస్‌బీఐ అధికారులు భేటీ అయ్యారు. రాయదుర్గం భూములపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

హైదరాబాద్: రాయదుర్గం భూముల వ్యవహారంపై చర్చించేందుకు తెలంగాణ సచివాలయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (సీఎస్)తో ఎస్‌బీఐ ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. రాయదుర్గం భూముల అంశంలో ఎస్‌బీఐ వ్యవహరించిన తీరుపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఎస్‌బీఐలో ఉన్న ప్రభుత్వ ఖాతాలు, లావాదేవీలను పూర్తిగా ఉపసంహరించుకోవాలనే నిర్ణయంపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

Updated at - Jun 22 , 2026 | 05:07 PM