సీఐపైకి దూసుకెళ్లిన జక్కంపూడి

ABN, Publish Date - Apr 25 , 2026 | 08:57 AM

రంగంపేట పోలీస్‌స్టేషన్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ నేతలు కిడ్నాప్ చేసిన ఓటర్లను విడుదల చేయాలంటూ పోలీస్‌స్టేషన్ ఎదుట టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు.

తూర్పుగోదావరి జిల్లా, ఏప్రిల్ 25: రంగంపేట పోలీస్‌స్టేషన్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ నేతలు కిడ్నాప్ చేసిన ఓటర్లను విడుదల చేయాలంటూ పోలీస్‌స్టేషన్ ఎదుట టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. ఓటర్లను కిడ్నాప్ చేసిన వైసీపీ నేతలను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఇదే వ్యవహారంపై వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, సూర్యనారాయణ రెడ్డి పోలీస్‌స్టేషన్‌కు వచ్చి సీఐతో వాగ్వాదానికి దిగారు. సీఐ సుమంత్‌ను జక్కంపూడి రాజా బెదిరించారు.

Updated at - Apr 25 , 2026 | 08:58 AM