స్కాలర్షిప్ నిధుల విడుదల ప్రక్రియ వేగవంతం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ABN , Publish Date - Apr 29 , 2026 | 08:05 PM
రాష్ట్రంలోని పేద విద్యార్థులు ఎదుర్కొంటున్న స్కాలర్షిప్ నిధుల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
హైదరాబాద్, ఏప్రిల్ 29: రాష్ట్రంలోని పేద విద్యార్థులు ఎదుర్కొంటున్న స్కాలర్షిప్ నిధుల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. బుధవారం ప్రజా భవన్లో విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించారు.
ఈ సందర్భంగా మంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ‘విద్యార్థుల చదువుకు ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదు. అందుకే స్కాలర్ షిప్ విషయంలో సానుకూలంగా నిర్ణయం తీసుకున్నాం. పెండింగ్లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించి, అర్హులైన ప్రతి విద్యార్థికి సకాలంలో నిధులు అందేలా చూస్తాం. విద్యార్థుల సంక్షేమమే మా ప్రభుత్వ ప్రాధాన్యత. స్కాలర్షిప్ నిధుల విడుదల ప్రక్రియను వేగవంతం చేసి, విద్యార్థులకు భరోసా కల్పిస్తాం’ అని అన్నారు. ఈ సమావేశంలో విద్యాశాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొని, ప్రస్తుత నిధుల స్థితిగతులు, పెండింగ్ దరఖాస్తుల వివరాలను డిప్యూటీ సీఎంకు వివరించారు. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా వేల సంఖ్యలో ఉన్న విద్యార్థులకు పెద్ద ఉపశమనం కలగనుంది.
ఈ వార్తలు కూడా చదవండి:
అనంతపురం మీదుగా తిరుపతికి రైలు
రైలులో మహిళపై దారుణం.. ఏసీ కోచ్లోకి తీసుకెళ్లి..
Read Latest Telangana News and National News