తెలంగాణ బుల్లెట్ ట్రైన్స్ హబ్గా మారబోతోంది: అశ్వినీ వైష్ణవ్
ABN , Publish Date - Jul 11 , 2026 | 01:54 PM
దేశంలో 7 బుల్లెట్ ట్రైన్స్ ప్రకటిస్తే.. అందులో తెలంగాణకు 3 దక్కాయని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ కారణంగానే తెలంగాణకు మూడు బుల్లెట్ ట్రైన్స్ దక్కాయని వెల్లడించారు. తెలంగాణ బులెట్ ట్రైన్స్ హబ్గా మారబోతోందని అన్నారు.
హైదరాబాద్, జులై 11: దేశంలో 7 బుల్లెట్ ట్రైన్స్ ప్రకటిస్తే.. అందులో తెలంగాణకు 3 దక్కాయని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ కారణంగానే తెలంగాణకు మూడు బుల్లెట్ ట్రైన్స్ దక్కాయని వెల్లడించారు. తెలంగాణ బుల్లెట్ ట్రైన్స్ హబ్గా మారబోతోందని అన్నారు. బుల్లెట్ ట్రైన్స్ అందుబాటులోకి వస్తే.. హైదరాబాద్ నుంచి విజయవాడకు కేవలం 1 గంట 10 నిమిషాలు.. హైదరాబాద్ నుంచి ముంబైకి 2 గంటల 20 నిమిషాలు.. హైదరాబాద్ నుంచి చెన్నయ్కి రెండు గంటల్లో వెళ్లవచ్చని చెప్పారు.
ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ దేశంలో పెద్ద మార్పునకు శ్రీకారం చుట్టబోతోంది. కొంతమంది దీని క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రెడిట్ కేవలం నరేంద్ర మోదీకి మాత్రమే దక్కుతుంది. నరేంద్ర మోదీ.. బడ్జెట్లో తెలంగాణకి నిధులు పెంచారు. యూపీఏ ప్రభుత్వం 800 కోట్ల రూపాయలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఇస్తే.. మేము తెలంగాణకు 5000 కోట్ల రూపాయలు ఇచ్చాము’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి..
మంగళగిరిలో దారుణం.. అత్తమామలను కారుతో ఢీకొట్టిన అల్లుడు
టెహ్రాన్లో భారీ పేలుడు శబ్దం.. అసలు కారణం ఇదేనన్న ఇరాన్..