డేవిస్ కప్లో భారత్కు నిరాశ
ABN , Publish Date - Sep 20 , 2026 | 05:28 AM
డేవిస్కప్లో భారత జట్టు పోరాటం క్వాలిఫయర్ రెండో రౌండ్లోనే ముగిసింది. దక్షిణ కొరియా 3-1 ఆధిక్యంతో...
1-3తో కొరియా చేతిలో ఓటమి
సియోల్: డేవిస్కప్లో భారత జట్టు పోరాటం క్వాలిఫయర్ రెండో రౌండ్లోనే ముగిసింది. దక్షిణ కొరియా 3-1 ఆధిక్యంతో భారత్పై గెలిచి డేవిస్ కప్ ఫైనల్ 8లో చోటు దక్కించుకుంది. కొరియాతో పోరులో భాగంగా శుక్రవారం రెండు సింగిల్స్లో భారత్ ఓడిన విషయం తెలిసిందే. అయితే రెండో రోజైన శనివారం జరిగిన డబుల్స్లో భారత జోడీ దక్షిణేశ్వర్/శ్రీరామ్ బాలాజీ 6-3, 3-6, 6-3తో నామ్ జి సంగ్/పార్క్ ఉయి సంగ్ జంటపై గెలిచి ఆశలు రేపింది. కానీ కీలక రివర్స్ సింగిల్స్లో సుమిత్ నగాల్ 1-6, 2-6తో సూన్వూ క్వోన్ చేతిలో ఓడడంతో 3-1తో కొరియా స్పష్టమైన ఆధిక్యంతో ముందుకెళ్లింది.
ఇవి కూడా చదవండి...
హైదరాబాద్లో అంతర్జాతీయ చోరీ మొబైల్ ఫోన్ల డిస్పోజల్ రాకెట్ గుట్టురట్టు
మల్లూరు లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిపై మంత్రి సీతక్క ఆదేశాలివే
Read Latest Telangana News And Telugu News