15 బంతులు ఆడమన్నాడు
ABN , Publish Date - Apr 23 , 2026 | 01:55 AM
రోహిత్ శర్మ ఇచ్చిన సలహావల్లే గుజరాత్ టైటాన్స్పై తాను సెంచరీ చేయగలిగానని తిలక్ వర్మ వెల్లడించాడు. ఈసారి ఐపీఎల్లో...
ముంబై: రోహిత్ శర్మ ఇచ్చిన సలహావల్లే గుజరాత్ టైటాన్స్పై తాను సెంచరీ చేయగలిగానని తిలక్ వర్మ వెల్లడించాడు. ఈసారి ఐపీఎల్లో స్థాయికి తగ్గ రీతిలో ఆడలేకపోయిన తిలక్..అహ్మదాబాద్లో జరిగిన ఆ మ్యాచ్లో అజేయ శతకం (45 బంతుల్లో 101)తో చెలరేగిన సంగతి తెలిసిందే. ఇందుకు కారణమేమిటో తిలక్ వివరిస్తూ ‘రోహిత్ భాయ్తో ప్రత్యేకంగా మాట్లాడా. మ్యాచ్ పరిస్థితులతో సంబంధం లేకుండా తొలి 15-20 బంతులు ఆడు. నీ సత్తా ఏమిటో నీకు తెలుస్తుందన్నాడు’ అని చెప్పుకొచ్చాడు.
ఇవి కూడా చదవండి:
డ్రగ్స్ టెస్టులో పాజిటివ్.. పాక్ క్రికెటర్ కాంట్రాక్ట్ రద్దు చేసిన పీసీబీ
భారత లీగ్లో ఆడినందుకు ఆసీస్ మాజీ ప్లేయర్పై వేటు