క్రికెట్ అకాడమీలను ప్రారంభించిన మోదీ
ABN , Publish Date - Apr 29 , 2026 | 01:28 AM
ఈశాన్య రాష్ట్రాల్లో అధునాతన సౌకర్యాలతో బీసీసీఐ నిర్మించిన ఆరు ఇండోర్ క్రికెట్ అకాడమీలను...
గాంగ్టాక్ (సిక్కిం): ఈశాన్య రాష్ట్రాల్లో అధునాతన సౌకర్యాలతో బీసీసీఐ నిర్మించిన ఆరు ఇండోర్ క్రికెట్ అకాడమీలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ప్రారంభించారు. ఈశాన్య రాష్ట్రాల్లో క్రికెట్ను మరింతగా ప్రోత్సహించేందుకుగాను రాంగ్పో (సిక్కిం), డోయిముఖ్ (అరుణాచల్ప్రదేశ్), ఇంఫాల్ (మణిపూర్), మదన్ కుర్కలాంగ్ (మేఘాలయ), ఐజ్వాల్ (మిజోరం), డిమాపుర్ (నాగాలాండ్)ల్లోని ఈ అకాడమీలను ఆరంభించారు. ఐసీసీ చైర్మన్ జై షాతో బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్, కార్యదర్శి దేవజిత్ సైకియా తదితరులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు.
ఇవి కూడా చదవండి:
జనన రికార్డుల్లో వ్యత్యాసాలు.. అండర్ 17 మహిళా రెజ్లర్పై వేటు
మీ కలల పట్ల నిజాయతీగా ఉండండి: విరాట్ కోహ్లీ