పాక్పై చర్యలు తీసుకోవాలి
ABN , Publish Date - Feb 03 , 2026 | 05:44 AM
పాకిస్థాన్ యూటర్న్ తీసుకుంటుందని తాను ఊహించానని మాజీ కెప్టెన్ గవాస్కర్ చెప్పాడు. భారత్తో మ్యాచ్ను బహిష్కరించిన పాక్పై న్యాయపరమైన చర్యలు...
గవాస్కర్, హర్భజన్
న్యూఢిల్లీ: పాకిస్థాన్ యూటర్న్ తీసుకుంటుందని తాను ఊహించానని మాజీ కెప్టెన్ గవాస్కర్ చెప్పాడు. భారత్తో మ్యాచ్ను బహిష్కరించిన పాక్పై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని ఐసీసీని డిమాండ్ చేశాడు. ఇక, భారత్తో మ్యాచ్ ఆడడంలేదని చివరి నిమిషంలో ప్రకటించిన పాకిస్థాన్ను ఏమాత్రం ఊపేక్షించొద్దని మాజీ ఆటగాడు హర్భజన్ సింగ్.. ఐసీసీని కోరాడు. ‘పాక్ నిర్ణయం ఐసీసీకి నష్టం చేకూరుస్తుంది. అందువల్ల ఆ జట్టుపై చర్యలు తీసుకోవాలి’ అని భజ్జీ అన్నాడు.
ఇవీ చదవండి:
ఆ వ్యాఖ్యల వల్ల బాధపడి ఉంటే నన్ను క్షమించండి: మేరీ కోమ్