హైదరాబాద్ 631
ABN , Publish Date - Feb 01 , 2026 | 06:23 AM
మిడిలార్డర్ బ్యాటర్లు హిమతేజ (171), ప్రజ్ఞయ్ రెడ్డి (126) చెలరేగడంతో చత్తీస్గఢ్తో రంజీ మ్యాచ్లో హైదరాబాద్ భారీ స్కోరు సాధించింది. ఆట మూడో రోజైన...
చత్తీస్గఢ్తో రంజీ
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): మిడిలార్డర్ బ్యాటర్లు హిమతేజ (171), ప్రజ్ఞయ్ రెడ్డి (126) చెలరేగడంతో చత్తీస్గఢ్తో రంజీ మ్యాచ్లో హైదరాబాద్ భారీ స్కోరు సాధించింది. ఆట మూడో రోజైన శనివారం ఓవర్నైట్ స్కోరు 415/4తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన హైదరాబాద్ జట్టు 154 ఓవర్లలో 631 స్కోరుకు ఆలౌటైంది. అనంతరం రెండో ఇన్నింగ్స్ చేపట్టిన చత్తీస్గఢ్.. మూడో రోజు ఆట ముగిసేసరికి 39 ఓవర్లలో రెండు వికెట్లకు 100 పరుగులు చేసింది. హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు చత్తీస్గఢ్ ఇంకా 248 పరుగుల వెనుకంజలో నిలిచింది.
ఇవి కూడా చదవండి:
ఆ విషయంలో సూర్యకు క్రెడిట్ దక్కట్లేదు: ఇర్ఫాన్ పఠాన్
టీ20 ప్రపంచ కప్ 2026: ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. స్టార్ ప్లేయర్లకు దక్కని చోటు