ఫైనల్లో హైదరాబాద్
ABN , Publish Date - Jul 11 , 2026 | 03:12 AM
టీజీ20 లీగ్లో హైదరాబాద్ ఈ-చాంపియన్స్ ఫైనల్లో అడుగుపెట్టింది. శుక్రవారం జరిగిన క్వాలిఫయర్-2లో...
హైదరాబాద్: టీజీ20 లీగ్లో హైదరాబాద్ ఈ-చాంపియన్స్ ఫైనల్లో అడుగుపెట్టింది. శుక్రవారం జరిగిన క్వాలిఫయర్-2లో 8 వికెట్లతో కరీంనగర్ డైమండ్స్పై హైదరాబాద్ నెగ్గింది. తొలుత కరీంనగర్ 20 ఓవర్లలో 157/7 స్కోరు చేసింది. సింహా (38), శుభమ్ శర్మ (31 నాటౌట్) రాణించారు. అశ్విన్, అజయ్, ప్రణవ్ తలా రెండేసి వికెట్లు పడగొట్టారు. ఛేదనలో హైదరాబాద్ 15.3 ఓవర్లలో 160/2 స్కోరు చేసి గెలుపొందింది. అభిరథ్ (82), వికాస్ (45) సత్తా చాటారు. ఆదివారం జరిగే ఫైనల్లో అన్విత ఖమ్మం ఏసె్సతో హైదరాబాద్ తలపడుతుంది.
ఇవి కూడా చదవండి:
లార్డ్స్లో తొలి టెస్టు: స్మృతి మంధాన అరుదైన ఘనత
భారత్తో ఏకైక టెస్టు: టాస్ నెగ్గిన ఇంగ్లండ్ మహిళా జట్టు