Share News

ఇక ఫ్రాంచైజీ యజమానులు డుప్లెసి, క్లాసెన్‌, రోడ్స్‌

ABN , Publish Date - May 01 , 2026 | 02:14 AM

దక్షిణాఫ్రికా క్రికెట్‌ త్రయం డుప్లెసి, హెన్రిచ్‌ క్లాసెన్‌, జాంటీ రోడ్స్‌ యూరోపియన్‌ టీ20 లీగ్‌ జట్టును...

ఇక ఫ్రాంచైజీ యజమానులు డుప్లెసి, క్లాసెన్‌, రోడ్స్‌

న్యూఢిల్లీ : దక్షిణాఫ్రికా క్రికెట్‌ త్రయం డుప్లెసి, హెన్రిచ్‌ క్లాసెన్‌, జాంటీ రోడ్స్‌ యూరోపియన్‌ టీ20 లీగ్‌ జట్టును కొనుగోలు చేశారు. కన్సార్టియంగా ఏర్పడిన ఈ ముగ్గురు ఆటగాళ్లు రోటర్‌డామ్‌ ఫ్రాంచైజీని సొంతం చేసుకున్నట్టు లీగ్‌ నిర్వాహకులు గురువారం ప్రకటించారు. కొత్తగా ఆవిర్భవించిన ఆరుజట్ల ఈ లీగ్‌ వచ్చే ఆగస్టు 26 నుంచి సెప్టెంబరు 20 వరకు ఆరు యూరప్‌ నగరాలలో జరగనుంది.

ఇవి కూడా చదవండి:

ముంబై జట్టుకు మద్దతుగా వాంఖడే స్టేడియానికి వినోద్ కాంబ్లీ

రియాన్ పరాగ్‌పై బీసీసీఐ సీరియస్‌! జైలా..ఫైనా?

Updated Date - May 01 , 2026 | 02:14 AM