శతక్కొట్టిన దేవ్దత్
ABN , Publish Date - Aug 09 , 2026 | 05:17 AM
శ్రీలంక ఎలెవన్తో జరుగుతున్న వామప్ మ్యాచ్లో బౌలింగ్లో ప్రభావం చూపని భారత జట్టు.. బ్యాటింగ్లో మాత్రం అదరగొట్టింది. దేవ్దత్ పడిక్కళ్ (164 బంతుల్లో 18 ఫోర్లతో 142 బ్యాటింగ్) అజేయ శతకంతో...
భారత్ తొలి ఇన్నింగ్స్ 357/6
జడేజా హాఫ్ సెంచరీ
కొలంబో: శ్రీలంక ఎలెవన్తో జరుగుతున్న వామప్ మ్యాచ్లో బౌలింగ్లో ప్రభావం చూపని భారత జట్టు.. బ్యాటింగ్లో మాత్రం అదరగొట్టింది. దేవ్దత్ పడిక్కళ్ (164 బంతుల్లో 18 ఫోర్లతో 142 బ్యాటింగ్) అజేయ శతకంతో విజృంభించాడు. తద్వారా తొలి టెస్టుకు బెర్త్ను ఖాయం చేసుకున్నాడు. దేవ్దత్కు తోడు ఆల్రౌండర్ జడేజా (63) కీలక ఇన్నింగ్స్తో ఆకట్టుకోవడంతో వామప్లో రెండో రోజు శనివారం ఆట ముగిసేసరికి భారత్ 357/6 స్కోరుతో నిలిచింది. మానవ్ సుథర్ (41) ఫర్వాలేదనిపించాడు. ప్రస్తుతం భారత్ 6 రన్స్ వెనుకంజలో ఉంది. క్రీజులో దేవ్దత్తో పాటు గుర్నూర్ (36) ఉన్నాడు. అంతకుముందు లంక ఎలెవన్ తొలి ఇన్నింగ్స్ను 363/8 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది.
రాణించిన టాపార్డర్: ఓపెనర్ జైస్వాల్ రెండో బంతికే డకౌటైనా.. ఇతర టాపార్డర్ బ్యాటర్లు అద్భుతంగా ఆడారు. మరో ఓపెనర్ రాహుల్ (40)తో కలిసి వన్డౌన్ బ్యాటర్ దేవ్దత్ రెండో వికెట్కు 96 పరుగులు జోడించాడు. దేవ్దత్ పేస్, స్పిన్ను సాధికారికంగా ఎదుర్కొంటూ బౌండరీలు రాబట్టాడు. డిఫెన్స్తో పాటు స్పిన్ బౌలింగ్లో చక్కటి ఫుట్వర్క్తో ఆకట్టుకున్నాడు. విజెసుందర ఓవర్లో హ్యాట్రిక్ ఫోర్లు సాధించిన అతను శతకం తర్వాత రిటైర్డ్ అవుటయ్యాడు. అప్పటికి జడేజా జతగా మూడో వికెట్కు 71 రన్స్ అందించాడు. ఆ వెంటనే వచ్చిన పంత్ (2), జురెల్ (1) నిరాశపర్చారు. అయితే మానవ్తో కలిసి జడ్డూ ఆరో వికెట్కు 76 రన్స్ చేర్చి రిటైర్డ్ అవుట్గా వెనుదిరిగాడు. అనంతరం భారత్ 6 వికెట్లు కోల్పోయాక 73వ ఓవర్లో దేవ్దత్ తిరిగి బ్యాటింగ్కు వచ్చాడు. చివరి ఓవర్లో బ్రార్ ఐదు బంతుల్లో 4 సిక్సర్లు బాదడంతో 25 పరుగులు సమకూరాయి. దేవ్దత్-బ్రార్ జోడీ ఏడో వికెట్కు అజేయంగా 51 రన్స్ జోడించడం విశేషం.
సంక్షిప్త స్కోర్లు
శ్రీలంక ఎలెవన్ తొలి ఇన్నింగ్స్: 363/8 డిక్లేర్.
భారత్ తొలి ఇన్నింగ్స్: 90 ఓవర్లలో 357/6 (దేవ్దత్ 142 బ్యాటింగ్, జడేజా 63, మానవ్ 41, రాహుల్ 40, బ్రార్ 36 బ్యాటింగ్; అసంక 2/32, రమేశ్ 2/77).
ఇవి కూడా చదవండి:
టీమిండియాకు మరో ఎదురు దెబ్బ.. కీలక ప్లేయర్ ఔట్!
చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్.. మూడు సార్లు 6 వికెట్లు