వ్యూస్ కోసం అమాయకుల ప్రాణాలతో చెలగాటం.. ఇదో చెత్త ట్రెండ్..
ABN , Publish Date - Jun 20 , 2026 | 07:28 AM
సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలని, భారీగా వ్యూస్ తెచ్చుకోవాలని కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు ఇతరుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ప్రాంక్ల పేరుతో అభంశుభం తెలియని వారిని గాయాలపాలు చేస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలని, భారీగా వ్యూస్ తెచ్చుకోవాలని కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు ఇతరుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ప్రాంక్ల పేరుతో అభంశుభం తెలియని వారిని గాయాలపాలు చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ ప్రాంక్ ట్రెండ్ నడుస్తోంది. ఆ ప్రాంక్ బారిన పడిన జనం గాయాలపాలవుతున్నారు. వారి శరీరాలు కాలుతున్నాయి. ఇంతకీ ఆ ప్రాంక్ ఏంటంటే.. ఇన్ఫ్లుయెన్సర్లు హారతి పల్లెంతో వీధుల్లో తిరుగుతున్నారు. వీధుల్లో వెళ్లే వారిని హారతి తీసుకోమని అడుగుతున్నారు.
హారతి తీసుకునే ముందు చేతులు కడుక్కోమని వారి చేతులపై ఓ లిక్విడ్ పోస్తున్నారు. వాళ్లు ఆ లిక్విడ్తో చేతులు కడుక్కుని హారతి తీసుకోగానే.. భగ్గున చేతులకు మంటలు అంటుకుంటున్నాయి. అది కూడా చాలా పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. ఈ ప్రాంక్ కారణంగా చాలా మంది చేతులు కాలిపోయాయి. కొంతమంది ముఖాలు, వెంట్రుకలు కూడా కాలిపోయాయి. ఒక ఇన్ఫ్లుయెన్సర్ను చూసుకుని మరొక ఇన్ఫ్లుయెన్సర్ ఈ ప్రాంక్ను అమాయక జనంపై చేస్తున్నారు. ఆఖరికి అమ్మాయిలు కూడా ఈ ప్రాంక్ను చేయటం గమనార్హం.
హారతి ప్రాంక్ వీడియోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోపై జనం మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొంతమంది ఈ ప్రాంక్ చేసే వారికి మద్దతుగా నిలుస్తుంటే.. మరి కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రాంకులు చేసే వారిని ఊరికే వదిలిపెట్టకూడదు. పోలీసులు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి’..‘ఇది చాలా దారుణం. ఈ ప్రాంక్ చేసే వారిని పోలీసులు అరెస్ట్ చేయాలి’..‘ఈ ప్రాంక్లో అంత డేంజర్ ఏముంది.. ఏదో సరదా కోసం చేసింది’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
హైదరాబాద్లోని ఈ ఏరియాల్లో 10గంటల నుంచి కరెంట్ కట్
హీరోయిన్ రుక్మిణి వసంత్ ఫిర్యాదు.. ముగ్గురి అరెస్ట్..