యాదాద్రి భక్తులకు అలర్ట్.. ఆలయం మూసివేత
ABN, Publish Date - Mar 03 , 2026 | 09:32 AM
సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంను ఇవాళ ఉదయం 7 గంటలకు మూసివేశారు. గ్రహణం కారణంగా సంప్రదాయ ఆచారాలను అనుసరిస్తూ ఆలయ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
1/5
సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంను ఇవాళ ఉదయం 7 గంటలకు మూసివేశారు.
2/5
ప్రధానాలయంతో పాటు ఉపాలయాలు, అనుబంధ దేవాలయాలలో ఉదయం 7 గంటలలోపు సుప్రభాత, నిజాభిషేకం, అర్చనలు ముగించి మూసివేశారు.
3/5
గ్రహణం కారణంగా సంప్రదాయ ఆచారాలను అనుసరిస్తూ ఆలయ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
4/5
గ్రహణం ముగిసిన అనంతరం శుద్ధి కార్యక్రమాలు నిర్వహించి, రేపు ఉదయం నుంచి భక్తులకు తిరిగి దర్శనాలు ప్రారంభించనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు.
5/5
భక్తులు ఈ మార్పులను గమనించి తమ దర్శనాన్ని ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
Updated at - Mar 03 , 2026 | 09:34 AM