స్వగ్రామంలో విరోష్ జోడీ సందడి
ABN, Publish Date - Mar 02 , 2026 | 12:01 PM
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ వివాహం అనంతరం మొదటిసారిగా తన స్వగ్రామమైన నాగర్ కర్నూల్ జిల్లా తుమ్మన్పేట్కు వెళ్లారు. ఆయనతో పాటు భార్య రష్మిక మందన్న కూడా ఉన్నారు.
1/6
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. వీరిద్దరి వివాహం ఫిబ్రవరి 26న రాజస్థాన్ ఉదయ్ పూర్ లోని ఐటీసీ మెమోంటో హోటల్లో గ్రాండ్గా జరిగింది.
2/6
పెళ్లి తర్వాత తొలిసారిగా విజయ్ తన సొంతూరైన నాగర్ కర్నూల్ జిల్లా తుమ్మన్పేట్కు వెళ్లారు. ఆయనతో పాటు భార్య రష్మిక కూడా ఉన్నారు.
3/6
గ్రామానికి చేరుకున్న వెంటనే విజయ్–రష్మిక జంటకు గ్రామస్తులు, బంధువులు ఘన స్వాగతం పలికారు.
4/6
సంప్రదాయ పద్ధతిలో దిష్టి తీసి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.
5/6
తుమ్మన్ పేటలో నూతన ఫామ్ హౌస్లో గృహప్రవేశం, సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహిస్తున్నారు.
6/6
స్వగ్రామంలోనే రిసెప్షన్ ఏర్పాటు చేయగా టాలీవుడ్ నటుల రాకతో తుమ్మంపేట గ్రామ పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి.
Updated at - Mar 02 , 2026 | 12:10 PM