Medaram Jatara: మేడారం జాతరకు శుభారంభం.. వనదేవతలకు శుద్ధి పూజలు
ABN, Publish Date - Jan 14 , 2026 | 04:41 PM
తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన సమ్మక్క-సారలమ్మ మహా జాతరకు శుభారంభం అయింది.
1/15
సమ్మక్క-సారలమ్మ మహా జాతరకు శుభారంభం.. నేడు (జనవరి 14, 2026) పూజారులు సంప్రదాయ రీతిలో వనదేవతలను శుద్ధి చేసే పూజలు నిర్వహించారు.
2/15
గద్దెల ప్రాంగణంలో అందమైన ముగ్గులు వేసి, భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు భక్తులు.
3/15
ఈ రోజు గుడిమేలిగే పండుగగా జరుపుకుంటారు.
4/15
నేటి నుంచి జాతర మొదలైందని పూజారులు ప్రకటించారు.
5/15
దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, శుద్ధి కార్యక్రమాలు జరిగాయి.
6/15
ఇది మహా జాతరకు ముందస్తు ఆచారంగా భావిస్తారు.
7/15
శాశ్వత ఆలయ నిర్మాణాలు, మౌలిక సదుపాయాలు సిద్ధమవుతున్నాయి.
8/15
ముఖ్య జాతర కార్యక్రమాలు జనవరి 28 నుంచి 31 వరకు నాలుగు రోజుల పాటు జరగనున్నాయి.
9/15
ఈసారి భక్తుల సంఖ్య గతంలో కంటే భారీగా ఉండే అవకాశం ఉంది. మూడు కోట్ల మంది వరకు రావచ్చని అంచనా.
10/15
ప్రభుత్వం జాతర కార్యక్రమానికి భారీగా నిధులు కేటాయించింది.
11/15
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పోలీసు, అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు.
12/15
సమ్మక్క, సారలమ్మ వనదేవతలు గిరిజన సంస్కృతి, ప్రకృతి ఆరాధనకు చిహ్నాలు.
13/15
ఈ జాతరలో భక్తులు మొక్కులు తీర్చుకుంటారు.
14/15
సంప్రదాయ నృత్యాలు, సంగీతం, గిరిజన సంస్కృతి ప్రదర్శనలు జరుగుతాయి.
15/15
మేడారం జాతరకు వెళ్లే భక్తులు సురక్షితంగా ప్రయాణించాలని, తగిన ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.
Updated at - Jan 14 , 2026 | 07:31 PM