భోగాపురం ఎయిర్‌పోర్టును ప్రారంభించిన ప్రధాని మోదీ

ABN, Publish Date - Aug 01 , 2026 | 01:23 PM

విజయనగరం జిల్లాలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. విమానాశ్రయ టెర్మినల్ భవనంలో ఏర్పాటు చేసిన అతిపెద్ద వీడియో వాల్‌ను ప్రధాని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రూ.4,727 కోట్లతో భోగాపురం ఎయిర్‌పోర్ట్‌‌ను నిర్మించారు. ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవానికి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.

భోగాపురం ఎయిర్‌పోర్టును ప్రారంభించిన ప్రధాని మోదీ 1/6

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించి, జాతికి అంకితం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ.

భోగాపురం ఎయిర్‌పోర్టును ప్రారంభించిన ప్రధాని మోదీ 2/6

ఓపెన్ టాప్ జీపులో వెళ్తూ గిరిజన విద్యార్థినిలు, మహిళలు చేసిన థింసా నృత్యాన్ని మోదీ తిలకించారు. ప్రధానితో పాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ ఉన్నారు.

భోగాపురం ఎయిర్‌పోర్టును ప్రారంభించిన ప్రధాని మోదీ 3/6

భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రాంగణంలో గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.

భోగాపురం ఎయిర్‌పోర్టును ప్రారంభించిన ప్రధాని మోదీ 4/6

భోగాపురం ఎయిర్‌‌పోర్టులో సీఎం చంద్రబాబుకు నవ్వుతూ కరచాలనం చేసిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. విమానాశ్రయం ముందు ఫొటో దిగిన సీఎం.

భోగాపురం ఎయిర్‌పోర్టును ప్రారంభించిన ప్రధాని మోదీ 5/6

ఎయిర్‌పోర్టు‌లో సీఎం చంద్రబాబుతో ఫొటో దిగిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి లోకేశ్, పల్లా శ్రీనివాసరావు, పీవీఎన్ మాధవ్, ఎంపీ శ్రీ భరత్.

భోగాపురం ఎయిర్‌పోర్టును ప్రారంభించిన ప్రధాని మోదీ 6/6

ముఖ్యమంత్రి చంద్రబాబుకు నమస్కారం చేస్తున్న మంత్రి నారా లోకేశ్.

Updated at - Aug 01 , 2026 | 01:41 PM