మత్స్యకారుల సమస్యలు అడిగి తెలుసుకున్న సీఎం చంద్రబాబు
ABN, Publish Date - Sep 01 , 2026 | 07:35 PM
పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో సీఎం చంద్రబాబు మంగళవారం పర్యటించారు. ‘పేదల సేవలో’ కార్యక్రమంలో భాగంగా మత్స్యకారులకు పింఛన్లు పంపిణీ చేసి.. వారి సమస్యలు, సంక్షేమ పథకాల అమలుపై ఆరా తీశారు.
1/5
పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో పర్యటించిన సీఎం చంద్రబాబు.. పడవల వద్ద కూర్చున్న మత్స్యకారులతో ఆప్యాయంగా మాట్లాడారు. మత్స్యకారుల కుటుంబాల పరిస్థితి, సంక్షేమ పథకాలు అందుతున్న తీరును సీఎం అడిగి తెలుసుకున్నారు.
2/5
తిరుమని స్వామి అనే మత్స్యకారుడికి సీఎం చంద్రబాబు స్వయంగా పింఛన్ సొమ్మును అందజేశారు. వారి కుటుంబ యోగక్షేమాలపై ఆరా తీశారు. ప్రభుత్వం అందించే పథకాల పట్ల వారు సంతృప్తి వ్యక్తం చేశారు.
3/5
మత్స్యకారుడి ఆహ్వానం మేరకు సీఎం చంద్రబాబు వారితో కలిసి బోటులో ప్రయాణించారు. సముద్రంలో వేటకు వెళ్లే సమయంలో ఎదురయ్యే ఇబ్బందులపై మత్స్యకారులతో సీఎం చంద్రబాబు చర్చించారు.
4/5
వేటకు వెళ్లినప్పుడు మత్స్యకారుల రోజువారీ జీవితం ఎలా ఉంటుందో చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. వేట సమయంలో మత్స్యకారులు ఎన్ని గంటలు సముద్రంలో ఉంటారు, అక్కడ భోజనం ఎలా చేస్తారనే విషయాలను సీఎం ఆరా తీశారు.
5/5
వేట నిషేధ సమయంలో ప్రభుత్వం అందిస్తున్న రూ.20 వేల ఆర్థిక సాయం తమకు ఎంతో ఉపయోగపడుతోందని మత్స్యకారులు సీఎంకు తెలిపారు. మొగల్తూరు పర్యటనలో మత్స్యకారులతో సీఎం చంద్రబాబు సరదాగా ముచ్చటిస్తూ వారి సమస్యలను తెలుసుకున్నారు.
Updated at - Sep 01 , 2026 | 07:35 PM