మొక్కలు వాడిపోతున్నాయా..?
ABN , Publish Date - Jun 01 , 2026 | 12:41 AM
వేసవికాలంలో ఎండ వేడికి మొక్కలు వాడిపోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే...
వేసవికాలంలో ఎండ వేడికి మొక్కలు వాడిపోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే...
ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే మొక్కలకు నీటిని అందించాలి. ఆకులు, కాండం తడిసేలా నీటిని చిలకరించాలి. మట్టి తడారిపోకుండా రోజంతా తేమగా ఉండేలా చూసుకోవాలి.
మొక్కల చుట్టూ గడ్డి పరకలు, ఎండిన ఆకులు, కొబ్బరి పీచు, కొబ్బరి చిప్పల పెంకులు పరచాలి. వీటివల్ల మట్టి ఎప్పుడూ తడిగా ఉంటుంది. దీంతో వేర్లు బలంగా పెరిగి మొక్కలకు కావాల్సిన పోషకాలు సులభంగా అందుతాయి.
మొక్కలకు అధికంగా వేడి తగలకుండా వాటిపై గ్రీన్ నెట్ లేదా షెడ్ ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా టెర్రస్ గార్డెన్, బాల్కనీలో పెట్టుకునే కుండీలకు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.
ఎండాకాలంలో మొక్కలకు రసాయనిక ఎరువులు వాడకూడదు. వర్మీ కంపోస్టు, పశువుల ఎరువు, ఇంటి వ్యర్థాలతో తయారుచేసిన ఎరువులను అందిస్తే సరిపోతుంది.
ఈ వార్తలనూ చదవండి:
సైబర్ సెక్యూరిటీ లోపాలు ఉన్నాయ్.. ఓఎస్ఎం కాంట్రవర్సీపై సీబీఎస్ఈ స్పందన
యూపీలో ఎన్కౌంటర్.. టీనేజర్ హత్య కేసులో నిందితుడి మృతి