పురుగులు పట్టకుండా..
ABN , Publish Date - Jun 01 , 2026 | 12:48 AM
డబ్బాల్లో నిల్వ చేసిన పప్పులకు పురుగులు పట్టకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం...
డబ్బాల్లో నిల్వ చేసిన పప్పులకు పురుగులు పట్టకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం...
పప్పులు పోసిన డబ్బాల్లో రెండు బిరియానీ ఆకులు ఉంచితే ఎలాంటి పురుగులు చేరవు. పప్పులకు సువాసన కూడా పడుతుంది.
ఎండు మిరపకాయల ఘాటు ఉన్నచోటుకి పురుగులు త్వరగా చేరలేవు. పప్పుల డబ్బాల్లో పైపైన కొన్ని ఎండు మిర్చి ముక్కలు వేస్తే చాలు.
వేపాకులను బాగా ఎండబెట్టి పప్పుల్లో కలిపితే పురుగులు పట్టవు. అయితే పప్పులను ఉపయోగించుకునేటప్పుడు వేపాకులు లేకుండా చూసుకోవాలి. లేదంటే వండిన పదార్థాలు చేదుగా మారుతాయి.
నాలుగైదు వెల్లుల్లి రెబ్బలను పప్పుల డబ్బాల్లో వేస్తే ఆ ఘాటైన వాసనకు పురుగులు చేరవు.
పప్పులకు రెండు చుక్కల ఆవాల నూనె లేదా ఆముదాన్ని పట్టించి డబ్బాల్లో పోసిన ప్రయోజనం ఉంటుంది.
పప్పులను డబ్బాల్లో పోసి నిల్వ చేయడానికి ముందు ఒక పూటంతా ఎండలో ఆరబెట్టాలి. దీనివల్ల పప్పుల్లో తేమ ఆరిపోయి పురుగులు పట్టవు.
తేమ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నివశించేవారు పప్పులను గాలి చొరబడని డబ్బాల్లో పోసి ఫ్రిజ్లో పెట్టుకోవడం మంచిది. గాజు సీసాలు, స్టీల్ డబ్బాల్లో పోసి గట్టిగా మూతలు బిగించి నిల్వ ఉంచినా పప్పులకు పురుగులు పట్టవు.
పప్పుల డబ్బాల్లో చిన్న ఉప్పు పొట్లాలు, రెండు లవంగాలు, చిటికెడు పసుపు వేసినా ఫలితం ఉంటుంది.
ఈ వార్తలనూ చదవండి:
సైబర్ సెక్యూరిటీ లోపాలు ఉన్నాయ్.. ఓఎస్ఎం కాంట్రవర్సీపై సీబీఎస్ఈ స్పందన
యూపీలో ఎన్కౌంటర్.. టీనేజర్ హత్య కేసులో నిందితుడి మృతి