నిమ్మతొక్కలతో నిగారించేలా
ABN , Publish Date - Apr 22 , 2026 | 04:57 AM
నిమ్మతొక్కల్లో యాంటీఆక్సిడెంట్లు అధికం. ఇవి చర్మంపై ఏర్పడే నల్ల మచ్చలను తొలగించడంలో బాగా పనిచేస్తాయి....
నిమ్మతొక్కల్లో యాంటీఆక్సిడెంట్లు అధికం. ఇవి చర్మంపై ఏర్పడే నల్ల మచ్చలను తొలగించడంలో బాగా పనిచేస్తాయి. చర్మం సహజ కాంతితో నిగారించేందుకు తోడ్పడతాయి.
నిమ్మ తొక్కలను బాగా ఎండబెట్టి మెత్తటి పొడిలా చేయాలి. ఒక గిన్నెలో చెంచా నిమ్మ తొక్కల పొడి, చెంచా తేనె, మూడు చెంచాల గులాబీ నీళ్లు వేసి కలపాలి. ఈ పేస్టును మాఖానికి పట్టించి పావు గంటసేపు ఆరనిచ్చి ఆపైన గోరు వెచ్చటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే చర్మం బిగుతుగా మారి ముఖం తాజాగా కనిపిస్తుంది.
వెడల్పాటి గిన్నెలో కొన్ని నిమ్మతొక్కలు వేసి అవి మునిగేవరకూ నీళ్లు పోసి బాగా మరిగించాలి. తరువాత ఈ నీళ్లను ఓ స్ర్పే బాటిల్లోకి వడబోయాలి. ఇది మంచి టోనర్లా పనిచేస్తుంది. రోజూ రాత్రి పడుకునేముందు ముఖంపై ఈ నీటిని స్ర్పే చేసుకుంటే చర్మ రంధ్రాలు తెరచుకుని శుభ్రపడతాయి. మొటిమలు, మచ్చల బాధ తగ్గుతుంది.
ఇవి కూడా చదవండి:
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. టీమిండియా మహిళల స్థానాలివే!
కండరాల గాయం.. ఐపీఎల్ నుంచి ఆయుశ్ మాత్రే ఔట్