వేసవిలో పెరుగు తాజాగా...
ABN , Publish Date - Mar 23 , 2026 | 01:53 AM
ఎండాకాలంలో పెరుగు త్వరగా పులుపెక్కుతూ ఉంటుంది. అలాకాకుండా ఎక్కువసేపు పెరుగును కమ్మగా ఉంచే చిట్కాలివే...
ఎండాకాలంలో పెరుగు త్వరగా పులుపెక్కుతూ ఉంటుంది. అలాకాకుండా ఎక్కువసేపు పెరుగును కమ్మగా ఉంచే చిట్కాలివే...
పాలు మరీ వేడిగా ఉన్నప్పుడు కాకుండా కొద్దిగా చల్లారాక తోడు పెట్టాలి. తోడు కోసం ఎక్కువ పెరుగును కలపకూడదు. అరలీటరు పాలకు అర చెంచా పెరుగు కలిపితే చాలు. అప్పుడే పాలు మెల్లగా తోడుకుంటాయి. పెరుగు కూడా ఎక్కువసేపు కమ్మగా ఉంటుంది.
తోడు పెట్టిన తరువాత పాల గిన్నెను కిచెన్లో స్టవ్ పక్కన లేదంటే ఎండ తగిలే ప్రదేశంలో ఉంచకూడదు. చల్లగా ఉండే ప్రదేశంలో లేదంటే ఇన్సులేటెడ్ క్యాస్రోల్లో ఉంచడం వల్ల పెరుగు నెమ్మదిగా తోడుకుంటుంది. త్వరగా పాడైపోదు.
పాలను స్టీల్ గిన్నెలో కాకుండా మట్టి పాత్రలో పోసి తోడు పెడితే గడ్డ పెరుగు తయారవుతుంది. ఇది త్వరగా పులుపెక్కదు. మట్టి పాత్ర సహజంగానే తేమను పీల్చుకుని పెరుగును తాజాగా ఉంచుతుంది.
పాలు తోడు పెట్టిన తరువాత అందులో ఒక పచ్చి మిరపకాయను తొడిమతో సహా వేస్తే పెరుగు కమ్మగా తయారవుతుంది.
పెరుగు గిన్నె మీద మూత సరిగా అమరేలా చూసుకోవాలి. గిన్నెలో తడి చెంచాలు, గరిటెలు ఉంచకూడదు.
పెరుగు తోడుకుని గడ్డకట్టిన వెంటనే ఫ్రిజ్లో పెడితే రోజంతా తాజాగా ఉంటుంది. గది ఉష్ణోగ్రత వద్ద ఉంచితే మాత్రం గంట గంటకూ పులిసి పెరుగు పాడైపోతుంది.
మధ్యాహ్నానికి కావాల్సిన పెరుగు కోసం రాత్రి పూట, రాత్రికి కావాల్సిన పెరుగు కోసం ఉద యాన్నే పాలు తోడు పెట్టడం మంచిది.
ఇవి కూడా చదవండి
ప్రధాని మోదీ అరుదైన రికార్డ్.. అభినందనలు తెలిపిన సీఎం చంద్రబాబు
ఐపీఎల్ 2026: వారి బ్యాటింగ్ అదుర్స్.. కానీ టైటిల్ మాత్రం గెలవడం కష్టం: రాబిన్ ఉతప్ప